జగన్ 'సౌత్ కొరియా' కామెంట్.. ఫసక్ అంటూ మంచు మనోజ్ సెటైర్!
కరోనా ప్రభావంతో ప్రపంచంలోని చాలా దేశాలు స్థంబించిపోయే పరిస్థితి ఏర్పడింది. మిగిలిన దేశాల్లో కూడా కరోనా క్రమంగా విస్తరిస్తోంది. ఇండియాతో పాటు అగ్ర దేశాలన్నీ కరోనా ధాటికి వణికిపోతున్నాయి.
కరోనా ప్రభావంతో ప్రపంచంలోని చాలా దేశాలు స్థంబించిపోయే పరిస్థితి ఏర్పడింది. మిగిలిన దేశాల్లో కూడా కరోనా క్రమంగా విస్తరిస్తోంది. ఇండియాతో పాటు అగ్ర దేశాలన్నీ కరోనా ధాటికి వణికిపోతున్నాయి. ఇండియాలో పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూ పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించారు.
దీనితో తెలుగు రాష్ట్రాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇదంతా కరోనా తీవ్రతని తెలియజేస్తోంది. ఇదిలా ఉండగా ఏపీ సీఎం జగన్ కరోనా గురించి చేస్తున్న వ్యాఖ్యలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ట్రోలింగ్ కు గురవుతున్నాయి.
ఇటీవల జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. కరోనా వైరస్ సౌత్ కొరియాలో ప్రారంభమైందని పొరపాటుగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తమాయించుకుని సౌత్ కొరియానా, చైనానా అని మీడియా ప్రతినిధులని అడిగారు. దీనిపై ప్రస్తుతం నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు.
ఇక తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు జగన్ పై పరోక్షంగా సెటైర్లు పేల్చే విధంగా ఉన్నాయి. 'ఓన్లీ వన్ ఇన్ సౌత్ కొరియా.. ఫసక్.. కోవిడ్ 19 అవుట్ బ్రేక్' అని మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే మంచు మనోజ్ లాంగ్ గ్యాప్ తర్వాత అహం బ్రహ్మాస్మి అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన లభించింది.
మంచు మనోజ్ చేసిన ట్వీట్ ఇదే.