మల్లెపూలు బాగా నలిపిందా, అందుకే ఆమెని తెచ్చుకున్నారు.. మాధవి లత సంచలనం
చిత్ర పరిశ్రమలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల గురించి ధైర్యంగా మాట్లాడినా.. శ్రీరెడ్డి, కత్తి మహేష్ లాంటి వారిపై విమర్శలు గుప్పించినా, రాజకీయాల్లో కాషాయం కండువా కప్పుకున్నా హీరోయిన్ మాధవి లతకే చెల్లింది.
చిత్ర పరిశ్రమలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల గురించి ధైర్యంగా మాట్లాడినా.. శ్రీరెడ్డి, కత్తి మహేష్ లాంటి వారిపై విమర్శలు గుప్పించినా, రాజకీయాల్లో కాషాయం కండువా కప్పుకున్నా హీరోయిన్ మాధవి లతకే చెల్లింది. మాధవి లత ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నాయకురాలిగా కొనసాగుతోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో మాధవి లత పోటీ కూడా చేసింది. ఇదిలా ఉండగా మాధవి లతకు సొంత పార్టీపైనే ఆగ్రహం పుట్టుకొచ్చింది. అందుకు కారణం పార్టీలో కష్టపడేవారికి ప్రాధాన్యత దక్కకపోవడమే అట. తాజాగా మాధవి లత తన పేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది.
మాధవి లత ఈ పోస్ట్ ని గతంలో టిడిపిలో ఉండి ఆ తర్వాత బిజెపి కండువా కప్పుకున్న సాధినేని యామినిని ఉంద్దేశించినట్లుగా ఉంది. సాధినేని యామినికి బిజెపి అధికార ప్రతినిధి పదవి లభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పార్టీలో కూడా నిర్ణయం జరిగిపోయిందట.
దీనితో మాధవి లత ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ కోసం కష్టపడే వారికి కాకుండా నిన్న మొన్న పార్టీలో చేరినవారికి పదవులు కట్టబెట్టడం ఏంటి అని మాధవి లత అసంతృప్తి వ్యక్తం చేసింది. యామినిని ఉద్దేశిస్తూ.. మల్లెపూల వాసనల గురించి మాట్లాడేవారు ఏం చేసారని పదవులు ఇస్తున్నారు.. మల్లెపూల నిలిపిన కథలు బాగా చెప్పారు కనుకా?
పనికిమాలిన తిట్లు తిడితే పదవులు వస్తాయని తెలిసి ఉంటే నేను కూడా వేరే పార్టీ కండువా కప్పుకుని ఉండేదాన్ని. పరభాషల హీరోయిన్లని తెచ్చుకోవడం మా సినిమాల్లోనే అనుకున్నా.. ఇక్కడ కూడా ఇతర వాళ్ళని తెచ్చుకుని పదవులు ఇస్తున్నారు అంటూ మాధవి లతా సంచలన వ్యాఖ్యలు చేసింది.
గతంలో సాధినేని యామిని టిడిపిలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ మల్లెపూలు నలపడం తప్ప ఏమీ చేయలేడు అంటూ వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెని అదే పేరుతో పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.