మహేష్ బాబు భార్య నమత్ర గురించి ఆసక్తికర విషయాలు!
తెలుగులో వంశీ, అంజి సినిమాల్లో హీరోయిన్గా నటించిన నమ్రత శిరొద్కర్ తరువాత మన సూపర్ స్టార్ మహేష్ బాబును పెళ్లాడి తెలుగింటి కోడలయ్యింది. వంశీ సినిమా సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట తరువాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే నమ్రత గురించి తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ విషయాలే తెలుసు.
నమ్రతా శిరోద్కర్ 1993 లో మిస్ ఇండియాగా గెలుపొందింది.
మహేష్ నమ్రతలు వంశీ చిత్రం షూటింగ్లో కలుసుకున్నారు.
2000 సంవత్సరంలో కలుసుకున్న మహేష్, నమ్రతలు 2005లో పెళ్లి చేసుకున్నారు.
నమ్రతా శిరోద్కర్ ప్రముఖ నటి మీనాక్షి శిరోద్కర్కు మనవరాలు.
మహేష్ను పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు గుడ్బై చెప్పేసింది నమ్రత
నమ్రత మహేష్ బాబు కన్నా నాలుగేళ్ల పెద్దది. అయితే వయసు తారతమ్యం వారి ప్రేమకు, పెళ్లికి అడ్డు రాలేదు.
మహేష్ నమ్రతలకు 2006లో గౌతమ్, 2012లో సితారలు జన్మించారు.
మహేష్ బాబు షూటింగ్ సమయాల్లో ఏమాత్రం ఖాళీ దొరికిన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో గడిపేందుకే ఇష్టపడతాడు.
మహేష్ షూటింగ్లతో చాలా బిజీగా ఉంటాడు కాబట్టి ఇంటి బాధ్యతలను పూర్తి నమ్రతే చూసుకుంటుంది. ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో నమ్రత నిర్ణయమే ఫైనల్.
పిల్లలను అన్ని రంగాల్లో ఎంకరేజ్ చేస్తున్న నమ్రత తన కూతురు సితారతో ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయించింది. పనులన్ని ఆమే దగ్గరుండి చూసుకుంటుంది.