- Home
- Entertainment
- Entertainment News
- ఇండస్ట్రీని వదిలి టాప్ కంపెనీలలో జాబ్ చేసుకుంటున్న హీరోయిన్లు ఎవరో తెలుసా...?
ఇండస్ట్రీని వదిలి టాప్ కంపెనీలలో జాబ్ చేసుకుంటున్న హీరోయిన్లు ఎవరో తెలుసా...?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరిని లక్ వరిస్తుందో చెప్పలేం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంది. అయితే స్టార్ డమ్ లేకుండా పడిపోవడమే. ఇక ఇండస్ట్రీ వద్దు అనుకుని భారీ జీతాలకు జాబ్ చేసుకుంటున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.

సినిమాల్లో అయితే స్టార్ డమ్ వస్తుంది లేకుంటే పాతాళానికి పడిపోతారు. అయితే కొంత మంది తారలు మాత్రం సినిమా రంగంలో కొన్నాళ్ళు ఉండి. ఇక వద్దు అనుకుని బయటకు వెళ్ళి లక్షలు జీతాలు తీసుకుంటూ జాబ్ చేసుకుంటున్నారు. సినిమాల్లోనే కాకుండా బయట ఉద్యోగాలలో కూడా చక్రం తిప్పి టాప్ పొజిషన్ కు చేరుకున్న హీరోయిన్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మీకు హీరోయిన్ అపర్ణ గుర్తుందా..? అపర్ణ అంటే గుర్తుకు రాకపోవచ్చు కాకని.. సుందరాకాండ సినిమాలో అల్లరి పిల్ల అని చెపితే మాత్రం వెంటనే స్ట్రైయిక్ అవ్వచ్చు. వెంకటేష్ హీరో .. మీన హీరోయిన్ గా 1992లో వచ్చిన సినిమా సుందరకాండ .ఈ సినిమాలో మీనా ఒక హీరోయిన్ అయితే మరొక హీరోయిన్ అపర్ణ. టీచర్ గా వెళ్లిన వెంకటేష్ ను ఇష్టపడే స్టూడెంట్ పాత్రలో అపర్ణ నటించింది. ఈ సినిమా తరువాత కూడా అపర్ణను చాలా ఆఫర్లు పలకరింరించాయి. కాని ఆమె చదువు మీద ఇస్టంతో మరేసినిమా చేయలేదు. సైకాలజీలో గ్రాడ్యూయోషన్ చేసిన అపర్ణ.. 2002 లోపెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ప్రస్తుతం కాలిఫోర్నియా లో ఒక ప్రముఖ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో గత ఏడేళ్లు గా జాబ్ చేస్తూ.. లక్షల్లో సంపాదిస్తున్నారు.
ఇక సీతారామరాజు సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది మాన్య. అయితే మాన్య చాలా తక్కువ సినిమాలకే పరిమితం అయ్యారు. ఆమె సినిమాలు చేస్తున్న టైమ్ లోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి తరువాత మాన్య న్యూ యార్క్ లో సెటిల్ అయ్యారు. ఆమెకు నాలుగేళ్ళ పాప కూడా ఉంది అయినా సరే ఖాళీగా ఉండకుండా.. జేఆర్ మోర్గాన్ చేస్ అండ్ కో కంపెనీ లో పెద్ద ఉద్యోగం చేస్తుంది.
ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమాతో పాపులర్ అయిన నటి యామినీ శ్వేత. ఒక్క సినిమాతోనే ఆమె పాపులారిటి బాగా వచ్చింది. జయం సినిమాలో సదా చెల్లెలుగా నటించిన యామిని శ్వేతను వరుస అవకాశాలు పలకరించాయి. కాని ఆమె జయం సినిమా ఒకటే చేసి ఆ తరువాత మాయమయ్యింది. శ్వేత కి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలి అని లక్ష్యం ఉండటంతో అటు వైపు అడుగులు వేసింది. ఫారెన్ లో మాస్టర్స్ చేసి ఒక ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ కూడా చేస్తుందట శ్వేత. ఇక రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకున్న శ్వేత తన కుటుంబ వ్యాపారాన్ని చూసుకుంటున్నట్టు సమాచారం.
ఇక మరో హీరోయిన్ మయూరి కూడా ఇదే కోవలోకి వస్తుంది. మయూరి అంటే అర్ధం కాకపోవచ్చు కాని . మహేష్ బాబు వంశి సినిమాలో సెకండ్ హీరోయిన్ అంటే వెంటనే గుర్తుకు వస్తుంది. ఐఐటి ఖరగ్ పూర్ లో చదువుకున్న మయూరి తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తరువాత, సినిమాల్లో అవకాశాలు తగ్గడం తో జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో స్పెషల్ కోర్స్ చేశారు. ప్రస్తుతం ఆమె గూగుల్ ఇండియా లో కీలకమైన ఉద్యోగంలో ఉన్నారు.