అనుష్క 15 ఇయర్స్ సెలెబ్రేషన్స్.. రాజమౌళి, పూరి, రాఘవేంద్ర రావు సందడి
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన సూపర్ చిత్రం ద్వారా అనుష్క టాలీవుడ్ కు పరిచయమైంది. అనుష్క టాలీవుడ్ లోకి అడుగుపెట్టి 15 ఏళ్ళు పూర్తవుతోంది. దీనితో నిశ్శబ్దం చిత్ర యూనిట్ అనుష్క 15ఏళ్ళని సెలెబ్రేట్ చేస్తూ ఈవెంట్ నిర్వహించారు.
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం.
బాహుబలి తర్వాత అనుష్క చాలా నెమ్మదిగా చిత్రాలు ఎంచుకుంటోంది.
బాహుబలి తర్వాత అనుష్క భాగమతి చిత్రంలో మాత్రమే నటించింది.
దీనితో అనుష్క నుంచి మరో మూవీ ఎప్పుడు వస్తుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.
భాగమతి తర్వాత అనుష్క లాంగ్ గ్యాప్ తీసుకుంది.
విదేశాలకు వెళ్లి బరువు తగ్గాక నిశ్శబ్దం చిత్రాన్ని ప్రారంభించింది.
ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకుడు.
సస్పెన్స్ థ్రిల్లర్ గా నిశ్శబ్దం చిత్రం తెరకెక్కుతోంది.
అనుష్క టాలీవుడ్ కు పరిచయమై 15 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిశ్శబ్దం చిత్ర యూనిట్ ఈవెంట్ నిర్వహించింది.
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన సూపర్ చిత్రం ద్వారా అనుష్క టాలీవుడ్ కు పరిచయమైంది.
ఈ కార్యక్రమానికి పూరి జగన్నాధ్, రాఘవేంద్ర రావు, రాజమౌళి లాంటి ప్రముఖులంతా హాజరయ్యారు.
అనుష్క రాజమౌళి దర్శత్వంలో విక్రమార్కుడు, బాహుబలి చిత్రాల్లో నటించింది.
రాఘవేంద్ర రావు దర్శత్వంలో ఓం నమో వెంకటేశాయ చిత్రంలో నటించింది.
నిశ్శబ్దం చిత్రంలో హీరోయిన్ అంజలి కీలక పాత్రలో నటించింది.