`తాగి రచ్చ చేశావా` అన్న ప్రశ్నకు అనసూయ రిప్లై
బుల్లితెర మీద యాంకర్గా పరిచయం అయి తరువాత నటిగా మారిన అందాల భామ అనసూయ భరద్వాజ్. తెర మీద ఎంత సందడి గా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం అంత కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తుంది ఆ బ్యూటీ. గతంలోనూ అనుష్క చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్సదమైన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన అనసూయ అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించింది.
ఈ సందర్భంగా ఆమెను ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్న ఇరిటేట్ చేసింది. `తరుణ్ భాస్కర్లో కలిసి ఓ పార్టీలో తాగి గోల చేశారట కదా` అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా `నువ్వు ఇంకా పరిణతి చెందినట్లు లేవు. పరిణతి చెందితే నీకు అసలు నిజం ఏంటో తెలుస్తుంది` అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.
అనసూయ చేతి మీద ఉన్న టాటూ గురించి అడుగగా దానికి సమాధానం ఇచ్చింది. బ్యూటీ సోల్ డీప్ (దృడమైన మనస్థత్వం కలిగిన అందమైన యువతి) అని తన టాటూ అర్ధం అని చెప్పుకొచ్చింది.
ఇక తనకు అనసూయ అన్న పేరు ఎందుకు పెట్టారు అన్న ప్రశ్నకు సమాధానంగా అది మా నానమ్మ పేరని చెప్పింది ఈ భామ.
తనకు ఇష్టమైన స్థలం తన ఇల్లే అని చెప్పిన అనసూయ, స్వస్థలం నల్గొండ అని తెలిపింది.
తనకు ఇష్టమైన వ్యక్తి ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంగా నాకు నేనంటనే ఎక్కువ ఇష్టమని చెప్పింది.
లాక్ డౌన్ను చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నా అని చెప్పిన అనసూయ షూటింగ్ లను మిస్ అవుతున్నా అని చెప్పింది.
తనలో తనకు బాగా నచ్చే విషయం గురించి కూడా చెప్పింది. తను చాలా ఎమోషనల్ అదే తన శక్తి అని అదే తన బలహీనత కూడా అని తెలిపింది.