- Home
- Entertainment
- Entertainment News
- ఆ హీరోతో కలిసి గుళ్ళో అమీషా పటేల్ రొమాన్స్.. మండిపడుతున్న భక్తులు
ఆ హీరోతో కలిసి గుళ్ళో అమీషా పటేల్ రొమాన్స్.. మండిపడుతున్న భక్తులు
ఏంటో.. ఈమధ్య స్టార్ సెలబ్రిటీలు ప్రజలు, భక్తులు మనోభావాలు గట్టిగా దెబ్బతీస్తున్నారు.. రీసెంట్ గానే ఎక్కువగా ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈక్రంలో తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కూడా సరగ్గా ఇలాటిపనే చేసింది.

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు వారి అభిమానుల మనో భావాలు గట్టిగా దెబ్బతిస్తున్నారు. పవిత్ర స్థలాల్లో సెలబ్రిటీలు ప్రవర్తిస్తున్న తీరుకు ఎన్నో విమర్షలు ఎదుర్కొంటున్నారు స్టార్లు. ఆమధ్య తిరుమల తిరుపతి లో శ్రీవారి దర్శనం తరువాత ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్.. హీరోయిన్ కృతీ సనన్ ముద్దులు.. హగ్గులు హాట్ టాపిక్ అయ్యాయి.. ఇప్పటికీ ఆ వివాదం నడుస్తూనే ఉంది. రోజుకోమలుపు తిరుగుతంది. ఇక ఆమధ్య కోలీవుడ్ జంట నయనతార-విఘ్నేశ్ శివన్ఇదే తిరుమల దేవాలయాన్ని సందర్శించే సమయంలో మాడ వీధుల్లో చెప్పులతో తిరగడం ఎంత వివాదమైందో అందరికీ తెలుసు.
అసలు తిరుమల కొండపై ఏంటీ ఇటువంటి పనులెంటనీ నెటిజన్లు, జనాలు మండిపడుతున్నారు. హిందు వాదులు కూడా ఉద్యమాలకు రెడీ అవుతున్నారు. ఈక్రమంలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. అమీషా పటేల్ చేసిన ఓ పని సర్వత్ర విమర్షలకు దారితీస్తోంది. గురుద్వార్ లాంటి పవిత్ర స్థలంలో హీరోను కౌగిలించుకోవడం. ముద్దులు పెట్టడం లాంటి సన్నివేశాలు చిత్రించారు మూవీ టీమ్ .. ఇది కాస్త వైరల్ అవ్వడంతో పాటు వివాదంగా కూడా మారుతోంది.
సిక్కు మతస్థులు ఈ చర్యను తీవ్రంగా తీసుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీ జంట అమీషా పటేల్..సన్నీడియోల్. వీరిద్దరూ కలిసి గదర్-2 లో నటిస్తున్నారు. ఈ సినిమాను సిక్కుల పవిత్ర స్థలమైన గురుద్వారాలో కొన్నిసీన్స్ తెరకెక్కించారు మూవీ టీమ్. అయితే అందులో కౌగిలింత, ముద్దు సీన్ కూడా తీసినట్టు వీడియో వైరల్ అవ్వడంతో..సిక్కులు ఆగ్రహానికి గురయ్యారు.
పంచకులలోని గురుద్వారా శ్రీ కుహ్ని సాహిబ్ నిర్వాహకులు దీనిపై తీవ్రంగా స్పందించారు. గురుద్వారా మేనేజర్ సత్బీర్ సింగ్, సెక్రటరీ శివ కన్వర్ సింగ్ సంధు మాట్లాడుతూ.. అమీషా పటేల్, సన్నీడియోల్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తామని చిత్ర బృందం కోరిందని తెలిపారు.ఈ షూటింగ్ చేసేటప్పుడు ఎలాంటి దురుద్దేశపూర్వక సన్నివేశాలు తీయడం లేదని చెప్పారన్నారు. భైసాఖి పండుగ ప్రాముఖ్యత దృష్టా కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తామన్నారు
అయితే ఇప్పుడు ఇలాంటి సన్నివేశాలు తీయడమేమిటని మండిపడుతున్నారు. శిరోమణి గురుద్వార్ పర్బంధక్ కమిటీ కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రేవాల్ మాట్లాడుతూ.. గురుద్వారలో నమస్కరించే దృశ్యాన్ని చిత్రీకరిస్తామని చిత్ర బృందం తెలిపిందన్నారు. తరువాత రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించడం ఏంటని ఫైర్ అయ్యారు.