Prudhvi: ఆస్పత్రిలో చేరిన కమెడియన్ పృధ్వీ, వివాదమే కారణం?
Prudhvi: హఠాత్తుగా ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు కమెడియన్ పృధ్వీ.హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పృథ్విరాజ్ చికిత్స తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Actor Prudhvi admitted to hospital with High BP in telugu
టాలీవుడ్ లో థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ప్రస్తుత జనసేన నేత, మాజీ వైసీపీ నేత పృధ్వీరాజ్ ప్రస్తుతం హాస్పటిల్ పాలయ్యారు. హైదరాబాద్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. హై బీపీతో బాధపడుతున్నట్లు పృధ్వీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే హఠాత్తుగా ఇలాంటి పరిస్దితి రావటానికి గల కారణం గత రెండు రోజులుగా జరుగుతున్న లైలా సినిమా వివాదమే అని తెలుస్తోంది.
Comedian Prudhvi, Vishwak Sen
పృధ్వీరాజ్ గతంలో వైసీపీలో ఉంటూ ఎస్వీబీసీ ఛైర్మన్ గా కూడా పనిచేసారు. లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత ఆ పదవి నుంచి తొలగించడంతో పార్టీని వీడారు. ఆ తర్వాత జనసేనలో చేరి కూటమి గెలుపు కోసం పనిచేశారు. తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అదీ తన మాజీ పార్టీ వైసీపీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన తన తాజా చిత్రం లైలా మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ కు వెళ్లిన పృధ్వీ అక్కడ సందర్భం లేకపోయినా వైసీపీని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశారు. గతంలో 151 సీట్లతో ఉన్న వైసీపీ ఇప్పుడు 11 సీట్లకు వచ్చేసిందని గుర్తుచేస్తూ ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చారు.
పృధ్వీ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గతంలో సినిమా వాళ్లను టార్గెట్ చేశారని టాలీవుడ్ ప్రముఖులు చెప్పిన మాటల్ని గుర్తుచేస్తూ.. ఇలాంటి పనులు చేస్తే మరి చేయరా అంటూ వైసీపీ సోషల్ మీడియా కౌంటర్లు ఇస్తోంది. పృధ్వీ చేసిన వ్యాఖ్యలకు హీరో సారీ చెప్పినా.. పృధ్వీనే క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తూ.. ఎక్స్ వేదికగా #BoycotLaila పేరుతో టార్గెట్ చేసింది.
ఈ క్రమంలోనే 2025, ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం పృధ్వీ ఓ వీడియో రిలీజ్ చేశారు. వైసీపీకి.. జగన్ కు క్షమాపణలు చెప్పేది లేదని తెగేసి చెప్పాడు.. అప్పటి నుంచి వైసీపీ నుంచి సోషల్ మీడియా వేదికగా టార్గెట్ మరింత పెరిగింది. ఇదే సమయంలో లైలా మూవీ యూనిట్ నుంచి కూడా ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తుంది.
ఈ పరిణామాల క్రమంలో.. హఠాత్తుగా ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు కమెడియన్ పృధ్వీ.హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పృథ్విరాజ్ చికిత్స తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పృథ్వీరాజ్ ఆసుపత్రి బెడ్ పై పడుకొని ఉన్నారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది..