మీరు చెప్పేది? నేనెందుకు వినాలి... కోచ్ని నిలదీసిన రవి అశ్విన్... ఆర్ శ్రీధర్ మరో సంచలనం...
టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఆటో బయోగ్రఫీ ‘కోచింగ్ బియాండ్- మై డేస్ విత్ ఇండియన్ క్రికెట్ టీమ్’లో కొన్ని సంచలన విషయాలు వెల్లడించాడు. విరాట్ కోహ్లీ వైట్ బాల్ కెప్టెన్సీ కోసం ఎదురుచూశాడని, రవిశాస్త్రిని నిలదీశాడని బాంబ్ పేల్చిన శ్రీధర్, రవిచంద్రన్ అశ్విన్ గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు...
2014లో భారత జట్టు ఫీల్డింగ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న ఆర్ శ్రీధర్, డంకెన్ ఫ్లెచర్, అనిల్ కుంబ్లే, రవిశాస్త్రిలతో కలిసి పనిచేశాడు. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత రవిశాస్త్రితో పాటు ఆర్ శ్రీధర్ కూడా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు..
Ashwin-R Sridhar
‘అశ్విన్ ప్రతీ విషయంలో చాలా క్లియర్గా ఉంటాడు. భారత జట్టులోకి వెళ్లిన మొదటి వారంలో అశ్విన్తో జరిగిన సంభాషణ ఇప్పటికీ నా మైండ్లో అలాగే ఉండిపోయింది. అతను ఎలాంటి మొహమాటం లేకుండా ‘మీరేమీ అనుకోనంటే నేను ఓ మాట అడుగుతాను... మీరు చెప్పినవి నేను ఎందుకు వినాలి? మీరు చెప్పిన డ్రిల్స్ నేను ఎందుకు చేయాలి?’ అని అడిగాడు..
‘2011 నుంచి ట్రేవర్ పెన్నె మాకు ఫీల్డింగ్ కోచ్గా ఉన్నాడు. ఇప్పుడు మీరు వచ్చారు. మరో మూడేళ్లు మీరు ఉంటారు. ఆ తర్వాత మీరు వెళ్లిపోయి, ఇంకెవరో వస్తారు. అతను ఇంకేదో చెబుతాడు. మీరు చెప్పేది సరిగ్గా వర్కవుట్ అవుతుందని గ్యారెంటీ ఏంటి...
Ashwin
నా గేమ్కి ఇది ఉపయోగపడుతుందని నేను ఎలా నమ్మాలి? మీరు చెప్పేది ఎందుకు వినాలో? ఒక్క కరెక్ట్ రీజన్ చెప్పండి...’ అని నాతో అన్నాడు. ఆ మాటలు వినగానే నాకు షాకింగ్గా అనిపించలేదు. ఎందుకంటే అశ్విన్ గురించి నాకు తెలుసు. అయితే అతను అలా అడిగాక తనపై నాకు మరింత గౌరవం పెరిగింది...
R Ashwin
మేం ఇద్దరం చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. అతను కెరీర్లో ఏ స్థాయికి వెళ్తాడో నేను ముందుగానే ఊహించా. అశ్విన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు నేను ప్రయత్నించా. నేను కోచ్గా సక్సెస్ కావడానికి ఏం చేయాలనేదానిపై ఫోకస్ పెట్టా... అది మంచి ఫలితాలను తెచ్చింది...’ అంటూ రాసుకొచ్చాడు ఆర్ శ్రీధర్...