ఫామ్లో లేకపోయినా అజింకా రహానే జట్టులో ఉండాల్సిందే... ఎందుకంటే...
అజింకా రహానే... ఆస్ట్రేలియా టూర్కి ముందు ఈ క్రికెటర్పై చాలా విమర్శలు వచ్చాయి. అయితే వాటన్నింటికీ తన పర్ఫామెన్స్తోనే సమాధానం చెప్పాడు రహానే. ఓటమి ఎరుగని భారత కెప్టెన్గా రికార్డు క్రియేట్ చేశాడు...
మొదటి టెస్టులో అద్భుతంగా ఆడుతున్న విరాట్ కోహ్లీ రనౌట్కి కారణమైన రహానే, కెప్టెన్సీకి పనికిరాడంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే కోహ్లీ లేని జట్టును అద్భుతంగా నడిపించాడు అజింకా రహానే...
మెల్బోర్న్ టెస్టులో అజింకా రహనే చేసిన సెంచరీ, ఆడిలైడ్ ఘోర పరాజయం తర్వాత భారత జట్టు కోలుకుని విజయాల బాట పట్టడానికి ప్రధాన కారణం. ఆ తర్వాత పెద్దగా రాణించకపోయినా జట్టులో తనదైన ముద్ర వేశాడు రహానే.
ఒకప్పుడు భారత జట్టులో ప్రధాన ప్లేయర్గా వన్డే, టీ20, టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తూ వచ్చిన అజింకా రహానే, కొన్నాళ్లు వైట్ బాల్ క్రికెట్లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. రాణించడం లేదు అనేకంటే అతనికి పెద్దగా అవకాశాలు రావడం లేదని చెప్పాలి.
అయితే టెస్టుల్లో మాత్రం అజింకా రహానే చాలా కీలకం. టెస్టు జట్టుకి వైస్ కెప్టెన్గా వ్యవహారించే రహానే... విరాట్ కోహ్లీ లేని జట్టుతో ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి చరిత్ర క్రియేట్ చేశాడు. నాలుగు టెస్టుల్లో మూడు విజయాలు, ఓ డ్రాతో కెప్టెన్గా తిరుగులేని రికార్డు క్రియేట్ చేశాడు.
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం సౌంతిప్టన్ చేరుకున్న భారత జట్టులో అజింకా రహానే చాలా కీలకం. నిలకడ లేమి సమస్యతో బాధపడుతున్నప్పటికీ రహానే... టీమ్లో ఉండడం అనివార్యమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
భారత జట్టు తరుపున 73 టెస్టు మ్యాచులు ఆడిన అజింకా రహానే, 123 ఇన్నింగ్స్ల్లో 4583 పరుగులు చేశాడు. టెస్టుల్లో రహానే సగటు 41.28. ఇందులో 12 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
2013 భారత జట్టు తరుపున ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో 11వ స్థానంలో ఉన్నాడు అజింకా రహానే. ఈ లిస్టులో టాప్లో ఉన్న జో రూట్ కంటే రహానే 27 టెస్టులు తక్కువ ఆడడం విశేషం.
2013 నుంచి అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ కలిగిన వారిలో 8వ ప్లేయర్గా ఉన్న అజింకా రహానే, అత్యధిక సెంచరీలు చేసిన 9వ ప్లేయర్గా ఉన్నాడు. అన్నింటికీ మించి టెస్టు ఛాంపియన్షిప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ రహానేయే.
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో 28 ఇన్నింగ్స్లో ఆడిన అజింకా రహానే, 16 సార్లు 30 కంటే తక్కువ స్కోరు చేయగా, మూడు సార్లు 30-50 మధ్య పరుగులు చేసినా మొత్తం 1095 పరుగులతో టాప్లో ఉన్నాడు.
వెస్టిండీస్తో జరిగిన టెస్టులో 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను 81 పరుగులు చేసి ఆదుకున్నాడు అజింకా రహానే. ఇదే టెస్టు రెండో ఇన్నింగ్స్లో 102 పరుగులు చేసి భారత జట్టుకి మంచి స్కోరును అందించాడు.
అలాగే రాంఛీలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును 192 బంతుల్లో 115 పరుగులు చేసి ఆదుకున్నాడు.
మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో అజింకా రహానే చేసిన 112 పరుగులు, 2020లో అత్యుత్తుమ ఇన్నింగ్స్లలో ఒకడిగా అవార్డు కూడా దక్కించుకుంది.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్భాంధవుడిగా మారే అజింకా రహానే, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టుకి ఎంతో విలువైన ఆటగాడు. ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరీస్లోనూ రహానే రాణించడం టీమిండియాకి కీలకం.