MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • 20 మంది ఫాస్ట్ బౌలర్లు ఎందుకు? షమికి బీసీసీఐ షాక్ త‌ప్ప‌దా?

20 మంది ఫాస్ట్ బౌలర్లు ఎందుకు? షమికి బీసీసీఐ షాక్ త‌ప్ప‌దా?

Cricket - Mohammed Shami : స్టార్ బౌల‌ర్ మహ్మద్ షమీ గాయం కారణంగా వన్డే ప్రపంచకప్ 2023 త‌ర్వాత నుంచి టీమిండియాకు దూరంగా ఉన్నాడు. శస్త్రచికిత్స కారణంగా అతను 2024 టీ20 ప్రపంచ కప్ లో కూడా ఆడ‌లేదు. అయితే బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో అతని ఎంట్రీపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 05 2024, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Mohammed Shami

Mohammed Shami

Cricket - Mohammed Shami : జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లు ప్ర‌స్తుతం భారత జట్టులో టాప్ లో ఉన్న స్టార్ ఫాస్ట్ బౌలర్లు. వీరి తర్వాత శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్ ఇద్దరు మాత్రమే భార‌త జ‌ట్టుకు క‌నిపించే ఇత‌ర ఫాస్ట్ బౌల‌ర్లు.

అయితే, వీరిలో అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో మాత్రమే నిరంతరం ఆడుతున్నాడు. అయితే, టీ20 ఫార్మాట్ లో రాణించిన విధంగా ఇత‌ర ఫార్మాట్ల‌లో అత‌ని ప్ర‌ద‌ర్శ‌న క‌నిపించ‌లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Mohammed Shami

Mohammed Shami

బుమ్రా, షమీ తర్వాత ఎవరు? 

ఇప్పటి వరకు వన్డే, టెస్టు క్రికెట్‌లో అర్ష్‌దీప్ సింగ్ పెద్దగా రాణించలేకపోయాడు. అంతే కాకుండా ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, దీపక్ సహార్, ప్రశిత్ కృష్ణ, ఆకాష్ దీప్ సహా చాలా మంది ఆటగాళ్లు గత 2 సంవత్సరాలలో భారత జట్టుకు అరంగేట్రం చేసినప్పటికీ వారు కూడా మంచి ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌డంలో విఫ‌లం అయ్యారు. దీంతో భారత జట్టులో కొనసాగలేకపోయారు.

దీంతో భారత జట్టు మేనేజ్‌మెంట్ రెండో దశ ఫాస్ట్ బౌలర్ల గ్రూప్ ను ఏర్పాటు చేయలేకపోయింది. బుమ్రా ఇప్పటికే ముఖ్యమైన సిరీస్‌లలో మాత్రమే ఉప‌యోగించుకుంటోంది భార‌త జ‌ట్టు. మరోవైపు మహ్మద్ షమీ దాదాపు ఏడాది తర్వాత మళ్లీ క్రికెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. మహ్మద్ సిరాజ్‌కు స్థిరత్వం సమస్యగా మారింది.

 

35

ఈ క్ర‌మంలోనే వీరికి ప్ర‌త్యామ్నాయం పై బీసీసీఐ దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. అందులో భాగంగానే ఐపీఎల్ లో గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల పలువురు బౌలర్లను గుర్తించారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లేయ‌ర్ తుషార్ దేశ్‌పాండే, కేకేఆర్‌కు చెందిన హర్షిత్ రాణా, ఆర్సీబీకి చెందిన యశ్ దయాల్, వైశాక్ విజయకుమార్ ల‌ను గుర్తించింది. వీరు మంచి వేగంతో బౌలింగ్ చేయగలరు.

పెద్ద‌గా అనుభ‌వం లేదు.. 

అయితే వీరంతా టెస్టు క్రికెట్‌లో తగినంత అనుభవం ఇంకా పొందలేకపోయారు. ఉమ్రాన్ మాలిక్ లాంటి ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌లో అనుభవం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని భారత జట్టు మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నారు. ఎందుకంటే వారు టీ20 క్రికెట్‌లో కేవలం 24 బంతులు మాత్రమే వేస్తారని అన్నారు.

45

అలాగే, టెస్టు క్రికెట్‌లో ఉండే ఒత్తిడి టీ20 క్రికెట్‌లో కచ్చితంగా ఉండదు. కాబట్టి టీ20 క్రికెట్ ద్వారా ఎవరినీ అంచనా వేయలేరు. నా ప్రకారం బౌలర్లందరూ ఎర్ర బంతితో బౌలింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసేటప్పుడు పిచ్‌లు అధ్వాన్నంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. 

కొంత కాలంగా ఫాస్ట్ బౌలింగ్ భారం ఇద్ద‌రు ముగ్గురు బౌల‌ర్ల‌పై మోపి ఆడుతున్నాం. దీనిని అధిగ‌మించాలంటే ప్రతి బౌలర్ రివర్స్ స్వింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఎందుకంటే భారతదేశపు పిచ్ చరిత్ర అలాంటిది. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఇద్దరికీ ఇది అతిపెద్ద సహాయకంగా భ‌ర‌త్ చెప్పారు.

55
Mohammed Shami

Mohammed Shami

దులీప్ ట్రోఫీతో కొత్త బౌల‌ర్ల ఎంట్రీ

ఈ క్ర‌మంలోనే బీసీసీఐ ఏకంగా దులీప్ ట్రోఫీలో 20 మందికి పైగా ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేసింది. వీరిలో అవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, యశ్ దయాల్, తుషార్ దేశ్‌పాండే, ఆదిత్య థాకరే, ఆకాష్ సేన్‌గుప్తా, నవదీప్ సైనీ, మోతీ అవస్తీ, సందీప్ వారియర్, గౌరవ్ యాదవ్ వంటి పలువురు యంగ్ ప్లేయ‌ర్లు ఉన్నారు. 

ఈ దులీప్ ట్రోఫీలో మంచి ప్రదర్శన కనబరిచే ఫాస్ట్ బౌలర్లు బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో జరిగే టెస్టు సిరీస్‌లలో ఆడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో లేనప్పటికీ, భారత జట్టుతో ప్రయాణం కొనసాగించే అవకాశం పొందవచ్చు. ప్ర‌స్తుతం ష‌మీ ఫిట్ నెస్, వ‌య‌స్సు వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని బీసీసీఐ మ‌రో కొత్త ప్ర‌యోగం దులీప్ ట్రోఫీతో మొద‌లు పెట్టిందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL Qualifier 2, GT vs RR : గిల్ దెబ్బకు రాజస్థాన్ విలవిల... గుజరాత్ విజయానికి ప్రధాన కారణాలివే
Recommended image2
Vaibhav Sooryavanshi :100 మిస్సైతేనేంరా బుడ్డోడా, 1000 కొట్టేశావుగా : శతకం కాదు వైభవ శకమే..!
Recommended image3
IPL 2026: పాకిస్థాన్‌లోనూ వైభవ్ సూర్యవంశీ క్రేజ్.. మాములుగా లేదు మనోడి రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved