వెస్టిండీస్కి దెబ్బ మీద దెబ్బ... సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి, స్లో ఓవర్ రేటు కారణంగా...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నా, ఈ టోర్నీలో మిగిలిన స్థానాల కోసం ఫైట్ జరుగుతూనే ఉంది. వినడానికి వింతగా ఉన్నా షెడ్యూల్ ప్రకారం గత ఏడాది జరగాల్సిన టెస్టు సిరీస్లు, కరోనా కారణంగా వాయిదా పడడం వల్ల కొన్ని జట్లకి ఇప్పటికీ పాయింట్లు వస్తూనే ఉన్నాయి...
వెస్టిండీస్ టూర్లో జరిగిన టెస్టు సిరీస్ను, సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. కొన్నేళ్లుగా సరిగా విజయాలు లేక పాకిస్తాన్తో కూడా ఓడిన సఫారీ జట్టు, వెస్టిండీస్పై మళ్లీ టాప్ టీమ్ పర్ఫామెన్స్ ఇవ్వగలిగింది...
తొలి టెస్టులో సౌతాఫ్రికాకి ఇన్నింగ్స్ తేడాతో భారీ విజయం దక్కగా, రెండో టెస్టులోనూ 159 పరుగుల తేడాతో విజయం సొంతమైంది. అయితే రెండు టెస్టుల్లోనూ ఓడిన వెస్టిండీస్కి, స్లో ఓవర్ రేటు కారణంగా ఏకంగా 60 శాతం మ్యాచ్ ఫీజు కోత పడింది...
అంటే సౌతాఫ్రికాతో రెండో టెస్టు ఆడిన ప్లేయర్లు, బృందానికి కేవలం 40 శాతం మ్యాచ్ ఫీజు మాత్రమే చెల్లించబోతున్నారు. అదీకాకుండా ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఆర్టికల్ 16.11.2 నిబంధనను అతిక్రమించిన విండీస్కి, 6 పాయింట్ల పెనాల్టీ కూడా పడింది...
ఇప్పటికే రెండు జట్లు ఫైనల్లో తలబడుతుంటే... మిగిలిన జట్ల పాయింట్లలో కోత విధించడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. దీంతో ఐసీసీని ట్రోల్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు నెటిజన్లు..
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టోర్నీ పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచిన ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్లో టైటిల్ కోసం పోరాడుతుండగా... విండీస్ ఆరో స్థానంలో, సౌతాఫ్రికా ఏడో స్థానంలో ఉన్నాయి...
విండీస్తో జరిగిన రెండో టెస్టులో హ్యాట్రిక్ తీసిన కేశవ్ మహరాజ్, సౌతాఫ్రికా తరుపున టెస్టుల్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి స్పిన్నర్గా చరిత్ర క్రియేట్ చేశాడు.