తన బెస్ట్ ఐపీఎల్ టీమ్ను ప్రకటించిన వీరేంద్ర సెహ్వాగ్.. కెప్టెన్గా కోహ్లీ, రోహిత్ శర్మకి నో ప్లేస్...
మాజీ క్రికెట్ ఓపెనర్, ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ 2020 సీజన్కి సంబంధించి తన బెస్ట్ ఐపీఎల్ టీమ్ను ప్రకటించాడు. విరాట్ కోహ్లీని కెప్టెన్గా ఎంచుకున్న వీరేంద్ర సెహ్వాగ్, రికార్డు స్థాయిలో ఐదోసారి టైటిల్ గెలిచిన రోహిత్ శర్మకు జట్టులో స్థానం కూడా ఇవ్వకపోవడం విశేషం. వీరూ ఎంచుకున్న ప్లేయర్లు వీరే...
దేవ్దత్ పడిక్కల్... ఆరంగ్రేటం సిరీస్లో ఐదు హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన దేవ్దత్ పడిక్కల్ను ఓపెనర్గా ఎంచుకున్నాడు వీరేంద్ర సెహ్వాగ్..
కెఎల్ రాహుల్... 2020 సీజన్లో ఓ సెంచరీతో పాటు 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ను మరో ఓపెనర్గా తీసుకున్నాడు భారత మాజీ ఓపెనర్ వీరూ.
సూర్యకుమార్ యాదవ్... వరుసగా మూడు సీజన్లలో 400+ స్కోరు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డు సాధించిన ముంబై ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ను వన్డౌన్ బ్యాట్స్మెన్గా ఎంచుకున్నాడు వీరేంద్ర సెహ్వాగ్.
డేవిడ్ వార్నర్... సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ను టూడౌన్ బ్యాట్స్మెన్గా ఎంచుకున్న వీరేంద్ర సెహ్వాగ్... వార్నర్ ఓపెనర్గా కంటే మిడిల్ ఆర్డర్లోనే బెస్ట్ అంటూ కామెంట్ చేశాడు.
విరాట్ కోహ్లీ... వన్డౌన్లో బ్యాటింగ్కి వచ్చే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని, ఐదో నెంబర్ బ్యాట్స్మెన్గా సెలక్ట్ చేసుకున్నాడు వీరేంద్ర సెహ్వాగ్... ఈ ప్లేస్లో అయితే కోహ్లీ బెస్ట్ ఫినిషర్ రోల్ ప్లే చేయగలడని తెలిపాడు.
ఏబీ డివిల్లియర్స్... అతికీలకమైన ఆరో స్థానంలో ఏబీ డివిల్లియర్స్ను ఎంచుకున్నాడు వీరేంద్ర సెహ్వాగ్..
ఆ తర్వాత స్పిన్నర్ల జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్కు స్థానం దక్కింది...
ఆఫ్ఘాన్ ఆల్రౌండర్, స్పిన్నర్ రషీద్ ఖాన్కి కూడా తన జట్టులో చోటు కల్పించాడు వీరేంద్ర సెహ్వాగ్...
రబాడా... ఈ సీజన్లో 30 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్న ఢిల్లీ పేసర్ రబాడా కూడా వీరేంద్ర సెహ్వాగ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
బుమ్రా... ఈ సీజన్లో రబాడా కంటే 2 తక్కువ మ్యాచులు ఆడిన బుమ్రా, 27 వికెట్లు తీశాడు. బుమ్రాకి కూడా వీరూ బెస్ట్ ఐపీఎల్ ఎలెవన్ 2020లో చోటు దక్కింది.
షమీ... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక సమయంలో వికెట్లు తీసి అదరగొట్టాడు సీనియర్ పేసర్ షమీ. అందుకే షమీకి కూడా వీరూ జట్టులో చోటు దక్కింది.
ఇషాన్ కిషన్... సీజన్లో ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచిన ఇషాన్ కిషన్కి 12వ ప్లేయర్గా వీరేంద్ర సెహ్వాగ్ జట్టులో చోటు దక్కింది.
జోఫ్రా ఆర్చర్... ఆల్రౌండ్ పర్ఫామెన్స్తో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్గా నిలిచిన ఆర్చర్కి వీరేంద్ర సెహ్వాగ్ జట్టులో 13వ ప్లేయర్గా అవకాశం వచ్చింది.
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లకి వీరేంద్ర సెహ్వాగ్ టీమ్లో చోటు దక్కలేదు.