వాళ్లకంటే విరాట్ కోహ్లీ చాలా మెచ్యూర్డ్, అతనికి ఆ విషయం తెలుసు... జాంటీ రోడ్స్ కామెంట్స్...
టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే వరల్డ్ క్రికెట్ అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. తాజాగా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్, ఈ విషయం గురించి స్పందించాడు...
ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో వరల్డ్ జెయింట్స్ జట్టు తరుపున బరిలో దిగుతున్నాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్...
‘కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత విరాట్ కోహ్లీని ఫేస్ చేయడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నా దృష్టిలో అతనెప్పుడూ నాయకుడే...
టీమిండియా కెప్టెన్సీ కోల్పోయినంత మాత్రాన విరాట్ కోహ్లీకి పోయేదేం లేదు. అతను ఇప్పటికే భారత జట్టుకి అమూల్యమైన పరుగులెన్నో చేశాడు...
ఇప్పటికీ క్రీజులోకి వచ్చి పరుగులు చేయడానికి తహతహలాడుతూ ఉండే స్వభావం విరాట్ కోహ్లీది. ఇప్పటికీ అతను టీమిండియా ఆటగాడే...
టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనుకోవడం అతని వ్యక్తిగత నిర్ణయం. విరాట్ ఇంకా రిటైర్ అవ్వలేదు. చాలామంది కెప్టెన్లు, కెప్టెన్సీ నుంచి తప్పుకోగానే క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటారు..
వారితో పోలిస్తే విరాట్ కోహ్లీకి అంకిత భావం చాలా ఎక్కువ. క్రికెట్ అంటే అతనికి పిచ్చి. అందుకే ఇంకా క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాడు...
నూటికి రెండు వందల శాతం కమ్మిట్మెంట్ చూపించే విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ దొరకడం ఎవరికైనా అదృష్టమే. అతన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది...’ అంటూ చెప్పుకొచ్చాడు జాంటీ రోడ్స్...