విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం... టీ20 వరల్డ్కప్ తర్వాత కెప్టెన్సీకి వీడ్కోలు....
భారత సారథి విరాట్ కోహ్లీ, టీమిండియాకే కాదు వరల్డ్ టెస్టు మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకడు. టీ20, వన్డేల్లో కూడా కోహ్లీకి మంచి రికార్డు ఉంది. అయితే ఐసీసీ ఈవెంట్లలో మాత్రం విరాట్ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు...
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతుల్లో ఓడిన టీమిండియా, ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్కప్ సెమీస్లో, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూీజిలాండ్ చేతుల్లో ఓడింది...
ఐపీఎల్ కెరీర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా 8 సీజన్లుగా ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు విరాట్ కోహ్లీ...
అదే టైంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ ఐదు టైటిల్స్ అందుకున్నాడు. ఇదే విరాట్ కోహ్లీకి ఇబ్బందులు తీసుకొచ్చింది...
టీ20, వన్డేల్లో టీమిండియా కెప్టెన్సీని రోహిత్ శర్మకి అప్పగించాలని దాదాపు రెండేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు ‘హిట్ మ్యాన్’ అభిమానులు...
రెండేళ్లుగా బ్యాటుతో సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్న విరాట్ కోహ్లీ... టెస్టుల్లో కెప్టెన్గా కొనసాగినా, వన్డే, టీ20ల్లో కెప్టెన్సీని రోహిత్కి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాడట...
అక్టోబర్లో యూఏఈ వేదికగా జరిగే టీ20 వరల్డ్కప్ టోర్నీ... విరాట్ కోహ్లీకి పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఆఖరి టోర్నమెంట్ అని సమాచారం...
ఇప్పటికే రోహిత్ శర్మతో పాటు టీమ్ మేనేజ్మెంట్తో ఈ విషయం గురించి చర్చించిన విరాట్ కోహ్లీ... టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీ ఫలితం ఏదైనా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఫిక్స్ అయ్యాడట...
టీమిండియా తరుపున 65 టెస్టుల్లో 38 విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీ.... టీమిండియాకి అత్యధిక టెస్టు విజయాలు, విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న కెప్టెన్గా టాప్లో నిలిచాడు...
వన్డేల్లో 95 మ్యాచులకు కెప్టెన్గా వ్యవహరించిన విరాట్, 65 విజయాలను అందుకున్నాడు. 45 టీ20 మ్యాచుల్లో 29 మ్యాచుల్లో విజయాలు అందుకున్నాడు...
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా గత 9 టీ20 సిరీస్ల్లో ఓటమి ఎదుర్కోలేదు. టీమిండియా ఓడిన ఆఖరి రెండు టీ20 సిరీస్ల్లో ఓ దానికి రోహిత్, మరోదానికి శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరించడం విశేషం..
గత రెండేళ్లలో 52 ఇన్నింగ్స్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, బ్యాటింగ్పై పూర్తిగా ఫోకస్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.