ఫైనల్ మ్యాచ్ను మలుపు తిప్పింది ఆ సంఘటనే, ఆ తర్వాత... వీవీఎస్ లక్ష్మణ్...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా, న్యూజిలాండ్ చేతుల్లో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. రెండేళ్ల పాటు సాగిన సుదీర్ఘ టోర్నీలో టేబుల్ టాపర్గా ఉన్న భారత జట్టు, ఫైనల్లో మాత్రం ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది.
తొలి ఇన్నింగ్స్2లో 217 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్లో 170 పరుగులకే పరిమితమైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో దక్కిన 32 పరుగుల ఆధిక్యం పోగా మిగిలిన 139 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి చేధించింది న్యూజిలాండ్...
‘భారత బ్యాట్స్మెన్, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో మేం ఈజీగా గెలిచేయగలమనే కాన్ఫిడెన్స్తో బరిలో దిగినట్టు కనిపించింది...
వాళ్ల అనుభవం, టాలెంట్పై ఉన్న నమ్మకం కంటే, న్యూజిలాండ్ కండీషన్స్ వారికి అనుకూలించవనే భయం... వారి బ్యాటింగ్లో కనిపించింది...
భారత జట్టు బ్యాటింగ్లో లోపాలను పసికట్టిన న్యూజిలాండ్ బౌలర్లు జెమ్మీసన్, మిగిలిన బౌలర్లు... తేలిగ్గా వికెట్లను రాబట్టగలిగారు... అయితే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది మాత్రం ఐదోరోజే..
ఐదో రోజు మూడో సెషన్లో టిమ్ సౌథీ బౌలింగ్లో భారత ఓపెనర్లు శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ అవుట్ కావడమే మ్యాచ్ టర్నింగ్ మూమెంట్...
ఓపెనర్లు అవుట్ కావడంతో జెమ్మీసన్ విరాట్ కోమ్లీ, ఛతేశ్వర్ పూజారాలను ఆరో రోజు మొదటి గంటలోనే అవుట్ చేసి, మ్యాచ్ను పూర్తిగా న్యూజిలాండ్ చేతుల్లోకి తీసుకొచ్చేశాడు...
అజింకా రహానే కీలక సమయంలో అనుకోకుండా అవుటై పెవిలియన్ చేరడం... ఆ తర్వాత రవీంద్ర జడేజా కూడా తన నేచురల్ స్టైల్కి తగ్గ ఆటతీరు చూపించలేకపోవడం టీమిండియాపై ప్రభావం చూపించాయి...
అయితే రిషబ్ పంత్ ఎప్పటిలాగే న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అయితే పంత్ అవుటైన తర్వాత ఎప్పటిలాగే టెయిలెండర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు...
మ్యాచ్ మొత్తంలో విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా వికెట్లను తీసేందుకు జెమ్మీసన్ వర్కవుట్ చేసిన విధానం... చాలా ప్రశంసనీయం...
భారత బ్యాట్స్మెన్ వీక్నెస్లపై బాగా వర్కవుట్ చేసిన న్యూజిలాండ్, ఆ ప్లాన్స్కి సరిగ్గా అమలు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది....’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్..