ఆ విజయం ఇచ్చిన జోష్ ఇంకా అలానే ఉంది, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో... - అజింకా రహానే...
టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుతమైన టెస్టు సిరీస్గా ఐసీసీ చేత ‘ది అల్టీమేట్ టెస్టు సిరీస్’ అవార్డు అందుకుంది భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ 2020-21. ఈ సిరీస్ ఇచ్చిన విజయం ఇంకా మిగిలే ఉందని అంటున్నారు భారత వైస్ కెప్టెన్ అజింకా రహానే...
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టోర్నీలో భారత జట్టు ఆడిన అన్ని మ్యాచుల్లో పాల్గొని, 1095 పరుగులు చేసిన అజింకా రహానే... అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు...
‘వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేం ఈ టోర్నీ కోసం రెండేళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నాం. చాలా మంది టెస్టులు ఆడడం చాలా తేలిక అనుకుంటారు.
అయితే మిగిలిన ఫార్మాట్ల కంటే టెస్టులు ఆడడమే చాలా కష్టం. రెండేళ్ల క్రితం వెస్టిండీస్ సిరీస్తో మా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టోర్నీ సైకిల్ మొదలైంది....
అక్కడి నుంచి ప్రతీ సిరీస్లోనూ భారత జట్టు ప్రదర్శన నాకైతే సంతృప్తిని ఇచ్చింది. న్యూజిలాండ్ సిరీస్లో టెస్టు సిరీస్ గెలవకపోవడం మాత్రం కాస్త నిరాశకు గురి చేసింది...
మేం ఫైనల్ మ్యాచ్ను కూడా ఓ సాధారణ టెస్టులాగే చూడాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ప్రెషర్కి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది పర్ఫామెన్స్పై ప్రభావం చూపొచ్చు.
ఫైనల్ మ్యాచ్ కోసం మాకు కావాల్సినంత సమయం దొరికింది. ఈ టైమ్ను కరెక్టుగా వాడుకోవాలని అనుకుంటున్నాం. ప్రతీ ప్లేయర్ ఫైనల్ మ్యాచ్లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వాలనే కసితో ఉన్నారు...
ఆస్ట్రేలియా టూర్లో దక్కిన విజయం జట్టులో ఓ నూతనోత్సాహాన్ని నింపింది. తొలి టెస్టులో ఘోర పరాజయం తర్వాత కమ్బ్యాక్ ఇచ్చి సిరీస్ను సొంతం చేసుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను...
ఆ సిరీస్కి కెప్టెన్గా నేను వ్యవహారించడం అద్భుతమైన క్షణాలు. భారత జట్టులోని ప్రతీ సభ్యుడికి ఆస్ట్రేలియాలో దక్కిన విజయం చాలా ప్రత్యేకమైంది....
ఆ విజయం ఇచ్చిన జోష్ ఇంకా జట్టులో అలాగే ఉంది. ఇంగ్లాండ్లోనూ దాన్ని రిపీట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడి పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉంటాయి. కానీ అలవాటుపడితే, ఎక్కడైనా రాణించొచ్చు...
నా వరకూ నేను బ్యాటింగ్ను ఆస్వాదించాలనే కోరుకుంటున్నా. క్రీజులో సాధ్యమైనంత ఎక్కువ సేపు కుదురుకుని పరుగులు చేయాలని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు భారత టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానే.
మెల్బోర్న్ టెస్టులో సెంచరీ చేసిన అజింకా రహానే, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా ఈ ఫీట్ రిపీట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీనికి కారణం రహానే సెంచరీ చేసిన ఏ మ్యాచ్లోనూ భారత జట్టు ఓడిపోకపోవడమే.