MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అసలే ఫలితం రాలేదని ఏడుస్తుంటే... ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్ ఫీజులో భారీ కోత...

అసలే ఫలితం రాలేదని ఏడుస్తుంటే... ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్ ఫీజులో భారీ కోత...

ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన తొలి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఐదో రోజు ఎడతెడపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. అసలే ఫలితం రాలేదని ఏడుస్తుంటే... ఇరు జట్ల మ్యాచ్ ఫీజులో భారీ కోత విధించి షాక్ ఇచ్చింది ఐసీసీ...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 11 2021, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 65.3 ఓవర్లలో ఆలౌట్ కాగా... టీమిండియా  తొలి రోజు 13 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయగలిగింది...

28

తొలి రోజు ఎలాంటి వర్షం అంతరాయం లేకుండా 90 ఓవర్లు వేయాల్సిన చోట కేవలం 79 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆ తర్వాత రెండు, మూడో రోజు వర్షం అంతరాయం కారణంగా పూర్తి ఆట సాధ్యం కాలేదు... 

38

నాలుగో రోజు పూర్తి ఆట కొనసాగినా పూర్తి చేయాల్సిన కోటాకి 11 ఓవర్లు తక్కువగా వేశాయి ఇరు జట్లు. దీంతో స్లో ఓవర్ రేటు కారణంగా ఇరు జట్ల ఆటగాళ్ల ఫీజులో 40 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ...

48

అలాగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 టోర్నీలో జరిగిన మొట్టమొదటి మ్యాచ్‌ ఇది. వర్షం కారణంగా డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్ వల్ల ఇరు జట్ల ఖాతాలో చెరో నాలుగు పాయింట్లు చేరాయి...

58

అయితే స్లో ఓవర్ రేటు నిబంధనల కారణంగా ఈ నాలుగు పాయింట్లలో రెండు పాయింట్లు కోత విధించింది ఐసీసీ. 

68

దీంతో ప్రస్తుతం ఇంగ్లాండ్, ఇండియా రెండూ కూడా రెండేసి పాయింట్లతో 33 శాతం విజయాల రేటుతో ఉన్నాయి... డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే జట్టును నిర్ణయించేందుకు ఈ పాయింట్లు చాలా కీలకం అవుతాయి. 

78

డబ్ల్యూటీసీ 2019-21 టోర్నీలో ఫైనల్ చేరేందుకు అవసరమైన పాయింట్లు సాధించినప్పటికీ, స్లో ఓవర్ రేటు కారణంగా పాయింట్ల కోతకు గురైన ఆస్ట్రేలియా, ఫైనల్ చేరలేకపోయింది...

88

ఆస్ట్రేలియా స్థానంలో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా నిలిచిన న్యూజిలాండ్... ఫైనల్‌లో మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి టైటిల్ సాధించిన విషయం తెలిసిందే.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup: సూప‌ర్ 8కి ముందు కీల‌క మార్పులు.. ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి స్టార్ ప్లేయ‌ర్‌.?
Recommended image2
Sanju Samson : ఖేల్ ఖతం దుకాణం బంద్.. ఏషియన్ గేమ్స్ 2026 నుండి సంజూ శాంసన్ ఔట్
Recommended image3
T20 World Cup 2026 : వెళుతూ వెళుతూ ఆల్ టైమ్ రికార్డు బద్దలుగొట్టిన ఆసిస్.. అదేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved