SRHvsCSK: సెకండ్ రౌండ్లో తొలి మ్యాచ్... ధోనీ సేన ప్రతీకారం తీర్చుకుంటుందా?
IPL 2020 సీజన్ 13లో నేటి నుంచి సెకండ్ రౌండ్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ద్వితీయార్ధంలో తొలి మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఇరు జట్ల మధ్య ఈ సీజన్లో జరిగిన మొదటి మ్యాచ్లో సన్రైజర్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. నేటి మ్యాచ్లో ధోనీ సేన ప్రతీకారం తీర్చుకుంటుందా?
ఇరు జట్ల ఇప్పటిదాకా 13 మ్యాచులు జరగగా, చెన్నై 9 మ్యాచుల్లో గెలిచింది. సన్రైజర్స్కి 4 మ్యాచుల్లో విజయం దక్కింది.
అక్టోబర్ 2న ఇరుజట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్లో సన్రైజర్స్కి ఏడు పరుగుల తేడాతో విజయం దక్కింది.
మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది.
యంగ్ బ్యాట్స్మెన్ ప్రియమ్ గార్గ్ 51 పరుగులతో , అభిషేక్ శర్మ 31 పరుగులతో అదరగొట్టారు...
165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై 157 పరుగులకే పరిమితమైంది...
రవీంద్ర జడేజా ఐపీఎల్లో తొలి హాఫ్ సెంచరీ చేయగా... ధోనీ 47 పరుగులతో నాటౌట్గా నిలిచాడు...
రన్రేట్ కావాల్సిన టైమ్లో స్లోగా బ్యాటింగ్ చేసిన ధోనీ, ఓటమి ఖాయమైన తర్వాత ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు...
చెన్నైతో జరిగిన మ్యాచ్లోనే సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయపడి, ఆ తర్వాత సీజన్ మొత్తానికే దూరమయ్యాడు...
ఐపీఎల్ ఫస్ట్ హాఫ్లో 5 మ్యాచుల్లో ఓడిన ధోనీ సేన, ఫ్లేఆఫ్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్లో గెలవడం తప్పనిసరి...
ధోనీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్, నేటి మ్యాచ్లో ‘తలైవా’ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడతాడని నమ్మకంగా ఉన్నారు.