- Home
- Sports
- Cricket
- IND vs SL: ప్చ్.. ఈ టెస్టు నేను ఆడకుండా ఉంటే బాగుండేది సార్.. హనుమ విహారి సంచలన వ్యాఖ్యలు
IND vs SL: ప్చ్.. ఈ టెస్టు నేను ఆడకుండా ఉంటే బాగుండేది సార్.. హనుమ విహారి సంచలన వ్యాఖ్యలు
Hanuma Vihari: టెస్టు ఫార్మాట్ లో భారత జట్టుకు స్పెషలిస్టు బ్యాటర్ గా గుర్తింపు పొందిన హనుమ విహారికి వచ్చిన అవకాశాలు తక్కువే.. కానీ అతడు స్వయంగా టెస్టు ఆడనని.. తనను ఆడించకుంటే ఉంటే మంచిదని...

టెస్టు స్పెషలిస్టు హనుమ విహారికి వచ్చిన అవకాశాలు తక్కువైనా అతడు నిరూపించుకున్నదే ఎక్కువ. మిడిలార్డర్ లో తాను ఎంత విలువైన ఆటగాడో బోర్డర్-గవాస్కర్ ట్రోపీలో సందర్భంగా భారత జట్టుకు తెలిసివచ్చింది.
అయితే విహారి ఎంత తనను తాను నిరూపించుకుంటున్నా జట్టులో స్థానం మాత్రం గ్యారెంటీ లేదు. ఎవరైనా ఆటగాడు గాయపడితేనో.. లేక ఎవరైనా ఫామ్ కోల్పోతేనో అతడికి పిలుపువస్తున్నది. అయితే అలాంటి హనుమ విహారి.. జట్టు కోసం తన స్థానాన్ని కూడా వదులుకున్నాడట..
అప్పటికి భారత క్రికెట్ లో ఆటగాళ్లు ఉన్న ఫామ్ దృష్ట్యా.. అతడు టెస్టు నుంచి తప్పుకోవాలని అనుకున్నాడట. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్..
శ్రీధర్ స్పందిస్తూ.. ‘వైజాగ్ టెస్టుకు ముందు శ్రీధర్ నా దగ్గరకు వచ్చాడు. సార్ నేను ఈ టెస్టు నేను ఆడకుండా ఉండాల్సింది. మన జట్టులో ఇప్పటికే అందరూ ఫామ్ లో ఉన్నారు. మనకు ఇప్పుడు ఆరో బ్యాటర్ అవసరం లేదు. ఎక్స్ ట్రా బౌలర్ తో ఆడితే బెటర్.. నేను తర్వాత టెస్టును ఆడనన్నాడు’ అని చెప్పాడు.
2019 లో భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా.. వైజాగ్ లో తొలి టెస్టు ఆడింది. ఈ టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 502 పరుగులు చేసింది. తొల ఇన్నింగ్స్ లో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేయగా.. రోహిత్ శర్మ 176 రన్స్ కొట్టాడు. ఆ ఇన్నింగ్స్ లో విహారి 10 పరుగులే చేశాడు. ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన సౌతాఫ్రికా పై మహ్మద్ షమీ 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ విజయం సాధించింది.
విహారి కోరినట్టే పూణెలో జరిగిన రెండో టెస్టులో విహారి బెంచ్ కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచులో కూడా భారత్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో మయాంక్ అగర్వాల్ సెంచరీ చేయగా.. అప్పటి భారత సారథి విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ (254 నాటౌట్) తో కదం తొక్కాడు.