సంజూ శాంసన్ను సెలక్ట్ చేయకపోవడానికి అదే కారణం... మనీశ్ పాండే కంటే...
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో సీనియర్ వికెట్ కీపర్ సంజూ శాంసన్కి కాకుండా, ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కి అవకాశం ఇచ్చారు శిఖర్ ధావన్, కోచ్ రాహుల్ ద్రావిడ్... అయితే సంజూ శాంసన్ను పక్కనబెట్టడానికి కారణం వేరే ఉందట.
శ్రీలంక టూర్లో భారత జట్టు రెండు ఇంట్రా స్క్వార్డ్ ప్రాక్టీస్ మ్యాచుల్లో పాల్గొంది. భువీ టీమ్ వర్సెస్ శిఖర్ ధావన్ ఎలెవన్ టీమ్గా జరిగిన ఈ ప్రాక్టీస్ మ్యాచుల్లో సంజూ శాంసన్ గాయపడ్డాడు.
మొదటి వన్డేకి ముందు సంజూ శాంసన్ మోకాలి గాయంతో బాధపడుతుండడంతో అతని స్థానంలో ఇషాన్ కిషన్ను తుదిజట్టులో తీసుకున్నారు...
పుట్టినరోజునే టీమిండియా తరుపున వన్డే ఆరంగ్రేటం చేసిన ఇషాన్ కిషన్, 1990లో మొదటి మ్యాచ్ ఆడిన గుర్శరణ్ సింగ్ తర్వాత బర్త్ డే రోజునే వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన భారత క్రికెటర్గా నిలిచాడు..
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరుపున ఓపెనింగ్ చేసే పృథ్వీషాను తన ఓపెనింగ్ పార్టనర్గా ఎంచుకున్న శిఖర్ ధావన్, మంచి ఫామ్లో ఉన్న దేవ్దత్ పడిక్కల్ను పక్కనబెట్టడంపై ట్రోల్స్ వినిపిస్తున్నాయి...
పృథ్వీషాను ఓపెనర్గా ఎంచుకుని, వన్డౌన్ లేదా టూ డౌన్లో మనీశ్ పాండే స్థానంలో దేవ్దత్ పడిక్కల్ను ఆడించాల్సిందని అంటున్నారు అభిమానులు...
టూర్కి యువకులను ఎంపిక చేసి, తుదిజట్టులో మాత్రం ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...
ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ భారత జట్టు తరుపున ఆరంగ్రేటం చేసినా, వీళ్లిద్దరూ ఇప్పటికే టీమిండియా తరుపున టీ20లు ఆడారు....
కృనాల్ పాండ్యా, మనీశ్ పాండే వంటి ప్లేయర్ల స్థానంలో దేవ్దత్ పడిక్కల్, చేతన్ సకారియా వంటి యువకులకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..
2015లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ తర్వాత తొలిసారిగా భారత జట్టు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ లేకుండా బరిలో దిగుతోంది...