రికీ పాంటింగ్, స్మిత్, కలీస్, విరాట్... సచిన్ టెండూల్కర్ ముందు అందరూ పిల్లలే...
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, రికీ పాంటింగ్... ఇలా 21వ శతాబ్దంలో బెస్ట్ క్రికెటర్ ఎవరని చాలా పెద్ద డిస్కర్షనే జరిగింది. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది ఐసీసీ...
50 మంది మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు, ఎక్స్పర్ట్స్తో ఏర్పాటుచేసిన ఐసీసీ జ్యూరీ, స్టార్ స్పోర్ట్స్తో కలిసి ‘21వ శతాబ్దపు ఆల్టైం బెస్ట్ టెస్ట్ బ్యాట్స్మెన్’ ఎవరో తేల్చేందుకు ఓటింగ్ నిర్వహించింది...
ఈ ఓటింగ్లో భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్కే అత్యధిక ఓట్లు వేసింది ఐసీసీ జ్యూరీ. ‘మాస్టర్’తో పోటీపడిన సౌతాఫ్రికా మాజీ ఆల్రౌండర్ జాక్వస్ కలీస్... రెండో స్థానంలో నిలిచాడు...
ఆస్ట్రేలియా ప్రస్తుత క్రికెటర్ స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్తో పాటు భారత సారథి విరాట్ కోహ్లీ కూడా ఈ ఆల్టైం బెస్ట్ టెస్టు బ్యాట్స్మెన్ కోసం జరిపిన ఓటింగ్లో టాప్ 5లో నిలిచారు...
16 ఏళ్ల వయసులో ఆరంగ్రేటం చేసిన సచిన్ టెండూల్కర్, టీనేజ్ వయసులో వరల్డ్ క్లాస్ టాప్ బ్యాట్స్మెన్ను ఎదుర్కొంటూ చేసిన పరుగులు, సాధించిన రికార్డులు, సెంచరీలను లెక్కలోకి తీసుకున్న జ్యూరీ, ‘మాస్టర్’కే అవార్డు అందించారు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్లలో ఎక్కువ మంది, తమ ఫెవరెట్ క్రికెటర్గా సచిన్ టెండూల్కర్ పేరును ప్రస్తావించడం విశేషం...
భారత ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్తో పాటు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ టామ్ లాథమ్, డివాన్ కాన్వే వంటి ప్లేయర్లు సచిన్ ఆటను చూస్తే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చామని తెలియచేయడం విశేషం...