సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ... రిటైర్ అయినా కూడా వారి రేంజ్ వేరే లెవెల్ బాస్...
సచిన్ టెండూల్కర్... క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించి ఏడేళ్లు దాటిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీ... అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఏడాదిన్నర దాటింది... అయినా క్రేజ్, పాపులారిటీ విషయంలో మాత్రం ఈ ఇద్దరూ ఇద్దరే. భారత క్రికెట్ సారథి ‘కింగ్’ విరాట్ కోహ్లీ తర్వాత సోషల్ మీడియాలో హైయెస్ట్ బ్రాండ్ వాల్యూ ఉన్న క్రికెటర్లుగా నిలిచారు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ...
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న క్రికెటర్గా విరాట్ కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు...
![article_image2](https://static-ai.asianetnews.com/images/01etmj1xdjt23np7ja62rz46b3/virat-kohli--8--jpg_300x171xt.jpg)
ఇన్స్టాగ్రామ్లో దాదాపు 90 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న విరాట్ కోహ్లీ, ఫేస్బుక్లో 37 మిలియన్ల మంది, ట్విట్టర్లో 34 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్నాడు.
మొత్తంగా దాదాపు 161 మిలియన్ల ఫాలోవర్లతో ఆసియాలోనే అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ, ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు...
సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ 3.28 బిలియన్లుగా ఉంది... బ్రాండ్ వాల్యూ విషయంలో భారత్ నుంచి కోహ్లీయే టాప్...
విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో ఉన్నాడు ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్.. సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా బ్రాండ్ వాల్యూ 1.67 బిలియన్లు...
క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించి ఏడేళ్లు అయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో సచిన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా పెరిగింది కూడా...
సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోనీ... ఈ ఏడాది ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించిన మాహీ... సోషల్ మీడియాలో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన మూడో భారత క్రికెటర్గా నిలిచాడు.
మహేంద్ర సింగ్ ధోనీ సోషల్ మీడియా బ్రాండ్ వాల్యూ 1.24 బిలియన్లు...
సచిన్, కోహ్లీలకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటే, మహేంద్ర సింగ్ ధోనీకి మాస్ జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది...