RRvsDC: రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ... కీ ప్లేయర్లు వీరే...
IPL 2020 సీజన్లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. యువ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మ్యాచుల్లో 4 విజయాలు సొంతం చేసుకోగా, రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచుల్లో 2 మ్యాచులు గెలిచింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో మరోసారి సిక్సర్ల వర్షం కురవచ్చు. నేటి మ్యాచ్లో కీ ప్లేయర్లు, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే...
ఢిల్లీ, రాజస్థాన్ మధ్య ఇప్పటిదాకా 20 మ్యాచులు జరిగాయి.
రాజస్థాన్ 11 మ్యాచుల్లో గెలవగా, ఢిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచుల్లో విజయం సాధించింది.
ఇరు జట్ల మధ్య జరిగిన గత నాలుగు మ్యాచుల్లో మూడింట్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది.
సంజూ శాంసన్... షార్జా స్టేడియంలో సంజూ శాంసన్కి మంచి రికార్డు ఉంది. షార్జాలో జరిగిన మొదటి రెండు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు బాదాడు సంజూ శాంసన్.
రిషబ్ పంత్... దూకుడుగా ఆడుతున్నా, మంచి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు రిషబ్ పంత్. ధోనీ రిటైర్మెంట్ తర్వాత పంత్, శాంసన్ మధ్య పోటీ నెలకొనడంతో ఈ ఇద్దరి పోరు ఆసక్తికరంగా సాగనుంది.
స్టీవ్ స్మిత్... షార్జాలో జరిగిన మొదటి రెండు మ్యాచుల్లో స్టీవ్ స్మిత్ కూడా చెలరేగి ఆడాడు. నేటి మ్యాచ్లో స్మిత్, సంజూ చెలరేగి ఆడితే రాజస్థాన్ కష్టాలు తీరినట్టే.
పృథ్వీషా... అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీషా. షార్జా క్రికెట్ స్టేడియంలో పృథ్వీషా ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.
బట్లర్.. గత మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్తో ఆడాడు బట్లర్. ధాటిగా ఆడుతూ పరుగుల మోత మోగించాడు. నేటి మ్యాచ్లో బట్లర్ మరోసారి దూకుడు చూపిస్తే రాయల్స్ గెలవడం తేలికవుతుంది.
యశస్వి జైస్వాల్... తనకి అవకాశం వచ్చిన రెండు మ్యాచుల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు యంగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్. అయితే జైస్వాల్ టాలెంట్కి ఓ మంచి ఇన్నింగ్స్ దొరికితే చాలు, సీజన్లో పరుగుల వరద పారించగలడు.