టీమిండియా గెలవాలంటే ఏది ఏమైనా ఆ ఇద్దరూ ఆడాల్సిందే... - మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ సెషన్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది భారత జట్టు. అయితే ఫైనల్ మ్యాచ్కి ముందు టీమిండియాను వెంటాడుతున్న అతిపెద్ద సమస్య.... ది బెస్ట్ టీమ్ ఎలెవన్ను ఎంపిక చేయడం. 24 మందిలో ఫైనల్ ఆడే 11 మంది ఎంచుకోవడం ఇప్పుడు చాలా పెద్ద టాస్క్గా మారింది...
భారత జట్టు సాధారణంగా స్వదేశంలో జరిగే టెస్టుల్లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతుంటుంది. అయితే విదేశాల్లో మాత్రం ముగ్గురు పేసర్లు, ఓ స్పిన్నర్, ఓ బ్యాటింగ్ ఆల్రౌండర్తో ఆడించడం ఆనవాయితీ.
అయితే ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ తుదిజట్టులో ప్లేస్ కోసం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. స్టార్ స్పిన్నర్, సీనియర్ ప్లేయర్ కావడంతో అశ్విన్ను ఆడించాలని కొందరు అంటుంటే, మరికొందరు ఆల్రౌండర్, మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్ కావడంతో జడ్డూని తుదిజట్టులో చోటు ఇవ్వాలని అంటున్నారు...
‘విదేశాల్లో ఇద్దరు స్పిన్నర్లు అవసరమా? అంటే నా దృష్టిలో ఇప్పుడు అశ్విన్, జడేజా ఆడడం కచ్ఛితంగా చాలా అవసరం. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టు ఇప్పుడు మంచి ఫామ్లో ఉంది. ఇప్పటికే వాళ్లు ఇంగ్లాండ్ను ఇంగ్లాండ్లో ఓడించి, విజయోత్సాహాన్ని మూటకట్టుకున్నారు.
న్యూజిలాండ్ జట్టులో చాలామంది బ్యాట్స్మెన్ స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడానికి బాగా ఇబ్బందిపడతారు. కేన్ విలియంసన్కి స్పిన్ బౌలింగ్లో మంచి రికార్డు ఉన్నప్పటికీ, అశ్విన్కి అతనిపై మంచి రికార్డు ఉంది...
ఇంగ్లాండ్ పిచ్ కండీషన్స్ స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించవు. నిజమే కానీ ఇక్కడ కూడా అద్భుతంగా రాణించిన స్పిన్నర్లు చాలామంది ఉన్నారు. సొంత పిచ్లను పోలిన ఇంగ్లాండ్ పిచ్లపై పేస్ బౌలింగ్లో ఆడడం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్కి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
కాబట్టి తుదిజట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరికీ చోటు కల్పించాలి. ఈ ఇద్దరినీ కరెక్టుగా వాడుకోగలిగితే భారత జట్టు తప్పక విజయం సాధిస్తుంది’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
అయితే రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరికీ తుదిజట్టులో చోటు కల్పిస్తే, టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ హనుమ విహారి స్థానం గల్లంతవుతుంది... శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ, పూజారా, కోహ్లీ, అజింకా రహానే... స్పెషలిస్టు బ్యాట్స్మెన్లుగా బరిలో దిగుతారు.
ఆ తర్వాత రిషబ్ పంత్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కాగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ ఆల్రౌండర్లుగా బ్యాటింగ్కి వస్తారు...
ముగ్గురు బౌలర్ల స్థానం కోసం కూడా నలుగురు ఫాస్ట్ బౌలర్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా ఫైనల్ ఆడడం ఖాయంగా కనిపిస్తుంటే వారితో పాటు మరో పేసర్గా జట్టులో స్థానం దక్కించుకునేందుకు ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
అయితే సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కంటే మహ్మద్ సిరాజ్నే ఫైనల్లో బరిలో దింపాలని టీమిండియా భావిస్తున్నట్టు విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి మధ్య జరిగిన సంభాషణ లీక్ ఆడియో ద్వారా తెలుస్తోంది...