షారుక్ఖాన్ స్పీడ్ మామూలుగా లేదుగా... పంజాబ్ యజమాని ప్రీతి జింటాతోనే...
ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఏకంగా రూ.5కోట్ల 25 లక్షల భారీ మొత్తం దక్కించుకున్నాడు షారుక్ ఖాన్. అప్పటినుంచే ఈ కుర్రాడిపై అంచనాలు పెరిగిపోయాయి.
షారుక్ బ్యాటింగ్ చూసిన తర్వాత అతను పోలార్డ్లా బాదుతున్నాడని, అతని బౌలింగ్ చేయనని చెప్పేశానని అనిల్ కుంబ్లే చేసిన కామెంట్లు కూడా హాట్ టాపిక్ అయ్యాయి.
ఐపీఎల్ 2021 సీజన్లో తక్కువ మ్యాచుల్లో ఆడేందుకు అవకాశం వచ్చినా, వచ్చిన ఛాన్సులను చక్కగా వాడుకున్నాడు తమిళనాడు హిట్టర్ షారుక్ ఖాన్...
చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మిగిలిన బ్యాట్స్మెన్ అందరూ ఫెయిల్ అయిన సమయంలో షారుక్ఖాన్ ఒక్కడే 47 పరుగులు చేసి ఆదుకున్నాడు.
సీజన్ జరుగుతున్న సమయంలోనే విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీలతో చర్చలు జరుపుతున్న ఫోటోలతో తెగ హల్చల్ చేసిన షారుక్ ఖాన్, ఇప్పుడు ఏకంగా పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతిజింటాతోనే సందడి చేస్తున్నాడు.
ప్రీతిజింటాతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసిన షారుక్ ఖాన్...ఆమె నటించిన ‘కల్ హో న కహో’ సినిమాలోని డైలాగ్ను కాప్షన్గా పెట్టాడు. ‘నైనా... 1,2,3’ అంటూ ప్రతీజింటాతో దిగిన ఫోటోకి కాప్షన్ పెట్టాడు షారుక్.
వేలంలో షారుక్ను కొనుగోలు చేసిన తర్వాత కేకేఆర్ సహ యజమాని షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ను పిలిచి ‘మేం షారుక్ను కొన్నాం...’ అంటూ అరుస్తూ ఏడిపించిన ప్రీతి జింటా...అతని ఆటతీరుకి ఫ్యాన్ అయినట్టే కనిపిస్తోంది.
ఐపీఎల్ 2021 వేలంలో కేకేఆర్ యజమాని షారుక్ కొడుకు ఆర్యన్తో పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా...