గర్భంతో ‘శీర్షాసనం’ వేసిన అనుష్క శర్మ... కాళ్లు పట్టుకున్న విరాట్ కోహ్లీ...
సాధారణ వ్యక్తులే శీర్షాసం వేయడం చాలా కష్టం. అలాంటిది గర్భంతో అంటే... భయంతో గుండె గొంతులోకి రావడం ఖాయం. అయితే ఫిట్నెస్ అంటే ప్రాణమిచ్చే బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ... నిండు గర్భంతో శీర్షాసనం అందర్నీ షాక్కి గురి చేసింది. వచ్చే నెలలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్క శర్మ, నిండు గర్భంతో శీర్షాసనం వేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
చాలామంది సెలబ్రిటీల మాదిరిగానే ఇండియన్ మోస్ట్ ఫాలోయింగ్ సెలబ్రిటీ కపుల్ విరుష్క జోడికి కూడా లాక్డౌన్ బాగా కలిసి వచ్చింది...
అటు సినిమాలకీ, ఇటు క్రికెట్కి బ్రేక్ పడడంతో ఇద్దరూ కలిసి ఇంట్లోనే ఉంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. రిజల్ట్ కూడా అదిరిపోయింది...
2017 డిసెంబరులో అనుష్క శర్మను పెళ్లాడాడు భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ... అయితే బిజీ షెడ్యూల్స్ కారణంగా మొదటి ఏడాదిలో కేవలం 22 రోజులు మాత్రమే కలిసి ఉన్నామని ప్రకటించారు విరుట్, అనుష్క జోడి.
అనుష్క శర్మను పెళ్లాడిన తర్వాత పూర్తిగా వెజిటేరియన్గా మారిపోయిన విరాట్ కోహ్లీ, పాలు, పాల ఉత్పత్తులు కూడా తీసుకోవడం మానేశాడు...
పర్ఫెక్ట్ ఫిజిక్తో సిక్స్ ప్యాక్ బాడీతో మెరిసిపోయే ఫిట్నెస్ వెనక అనుష్క శర్మ కూడా ఉంది. ఈ ఇద్దరికీ ఫిట్నెస్ అంటే బాగా ప్రీతి...
తాజాగా ఆరు నెలల గర్భంతో శీర్షాసనం వేసి, అందర్నీ షాక్కి గురి చేసింది అనుష్క శర్మ.... ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది అనుష్క.
‘తల కిందికి, కాళ్లు పైకి పెట్టి వేసే ఈ ఆసనం పేరు ‘హ్యాండ్స్ డౌన్’. ఇది ఎంతో క్లిష్టమైనది.... నా జీవితంలో యోగా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది...
నా డాక్టర్ సలహాతో యోగాని చాలా ఏళ్లుగా పాటిస్తున్నాను. గర్భవతిని కాకముందు ఏయే ఆసనాలు వేసేదాన్నో, గర్భం దాల్చిన తర్వాత కూడా అవే ఆసనాలను వేస్తున్నాను...
అయితే గర్బం దాల్చిన తర్వాత సపోర్టు అవసరం... ఎన్నో ఏళ్లుగా శీర్షాసనం వేస్తున్నాను. నా భర్త నాకు బ్యాలెన్స్ చేయడానికి సపోర్ట్ చేశారు... ఆయన ప్రేమ నాకు మరింత రక్షణనిస్తుంది...
ఇది యోగా టీచర్ పర్యవేక్షణలో చేసింది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి... నా ప్రెగ్నన్సీ మొత్తం యోగా సెషన్స్ చేయడం నాకెంతో సంతోషంగా ఉంది...’ అంటూ రాసుకొచ్చింది అనుష్క శర్మ.
జనవరిలో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ప్రకటించిన అనుష్క శర్మ, గర్భంతోనే కొన్ని సినిమాలు, యాడ్స్ షూటింగ్లకి హాజరైంది... సాధ్యమైనన్ని కమిట్మెంట్స్ను పూర్తి చేయాలని చూస్తోంది...
మరోవైపు ప్రస్తుతం ఆసీస్ టూర్లో ఉన్న విరాట్ కోహ్లీ, మొదటి టెస్టు ముగిసిన తర్వాత పితృత్వ సెలవుల మీద స్వదేశానికి తిరిగి రానున్నాడు...