ఎమ్మెస్ ధోనీకి క్లియర్ చెప్పాం, రాహుల్ ద్రావిడ్కి ఆ ఇంట్రెస్ట్ లేదు... సౌరవ్ గంగూలీ కామెంట్స్...
టీమిండియా తర్వాత కోచ్ ఎవరు? ఇప్పుడు భారత క్రికెట్ ఫ్యాన్స్ని వెంటాడుతున్న ప్రశ్న ఇదే. ప్రస్తుత భారత హెడ్కోచ్ రవిశాస్త్రి కాంటాక్ట్ గడువు టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీతో ముగియనుంది...
ఇప్పటికే రెండుసార్లు కాంటాక్ట్ పూర్తి చేసుకున్న రవిశాస్త్రి, మరోసారి బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేనట్టు ప్రకటించాడు...
దీంతో టీ20 వరల్డ్కప్ టోర్నీ తర్వాత టీమిండియాకి కొత్త కోచ్ రాబోతున్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టీమిండియా కోచ్గా బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగింది...
ভারতীয় দলে ফের শাস্ত্রী, কোহলী, ধোনি ত্রিকোণ সমীকরণ। এটাই ফেরাতে চেয়েছিল সৌরভ গঙ্গোপাধ্যায়ের ভারতীয় ক্রিকেট বোর্ড। মেন্টর হিসেবে ধোনিকে এনে সেই কাজটাই করে দিলেন বোর্ড সচিব।
శ్రీలంక టూర్లో టీమిండియాకి కోచ్గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్, ఆ తర్వాత ఎన్సీఏ డైరెక్టర్ పదవికి మరోసారి దరఖాస్తు చేసుకోవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది...
ఎన్సీఏ డైరెక్టర్గా మరోసారి బాధ్యతలు తీసుకున్న రాహుల్ ద్రావిడ్, టీమిండియా హెడ్కోచ్ పదవి స్వీకరించడానికి సిద్ధంగా లేడని ప్రచారం జరుగుతోంది...
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీకి మెంటర్గా ఎమ్మెస్ ధోనీని నియమించింది బీసీసీఐ. దీంతో టీమిండియా తర్వాతి కోచ్ ధోనీయే అంటున్నారు మాహీ అభిమానులు...
‘ఎమ్మెస్ ధోనీ కేవలం టీ20 వరల్డ్కప్ 2021 వరకూ మాత్రమే టీమిండియాకి మెంటర్. ఆ విషయం అతనికి క్లియర్గా చెప్పాం...
రాహుల్ ద్రావిడ్, టీమిండియా హెడ్కోచ్ బాధ్యతలను పూర్తిస్థాయిలో స్వీకరించడానికి ఆసక్తిగా లేడు. అయితే ఇప్పటివరకూ ఈ విషయం గురించి అతనితో మాట్లాడింది కూడా లేదు...
ప్రస్తుతం టీ20 వరల్డ్కప్ టోర్నీపైనే పూర్తి ఫోకస్ పెట్టాం. ఆ టోర్నీ ముగిసిన తర్వాత హెడ్కోచ్ నియామకం గురించి ఆలోచిస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ...
ఐదో టెస్టు రద్దు గురించి కూడా మాట్లాడిన సౌరవ్ గంగూలీ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు... ‘అవును, కొందరు టీమిండియా ప్లేయర్లు ఐదో టెస్టు ఆడడానికి ఇష్టపడలేదు...
అయితే వారిని తప్పుపట్టలేం. ఎందుకంటే అసిస్టెంట్ ఫిజియో, చాలామందితో క్లీజ్ కాంటాక్ట్ అయ్యాడు. కొన్ని గంటల వరకూ తమతో గడిపిన ఫిజియో కరోనా పాజిటివ్గా తేలడంతో ఆటగాళ్లు భయపడ్డారు...’ అంటూ కామెంట్ చేశాడు సౌరవ్ గంగూలీ...