మనకంటే న్యూజిలాండ్కే ఎక్కువ విజయావకాశాలు, ఎందుకంటే... సంజయ్ మంజ్రేకర్ కామెంట్..
కెప్టెన్గా విదేశాల్లో చారిత్రక విజయాలు అందుకున్నా, తన కెరీర్లో ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేకపోయాడు భారత సారథి విరాట్ కోహ్లీ. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ గెలిచి, ఆ లోట తీర్చుకోవాలని భావిస్తున్నాడు.
జూన్ 18 నుంచి ఇంగ్లాండ్లోని సౌంతిప్టన్లోని రోజ్ బౌల్లో జరిగే ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా కంటే న్యూజిలాండ్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...
‘టీమిండియా బలంగా ఉంది. అయితే ఇంగ్లాండ్ వాతావరణం, అక్కడి పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చూస్తే, మనకంటే న్యూజిలాండ్కే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారికి అక్కడి పరిస్థితులు అనుకూలిస్తాయి.
ఇంగ్లాండ్ పిచ్, వాతావరణం న్యూజిలాండ్కి స్వదేశంలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. కాబట్టి వారికి అక్కడి పిచ్లపై రాణించడం పెద్ద కష్టమేమీ కాదు. అదీకాక ఫైనల్ కోసం కుకోబుర బంతిని వాడబోతున్నారు...
ఇండియా బౌలింగ్ విభాగం పటిష్టంగా కినిపిస్తోంది. అయితే న్యూజిలాండ్ బౌలర్లు పూర్తిగా వికెట్లను పడగొట్టడానికే ప్రాధాన్యం ఇస్తారు. మనలా ఫుల్ స్వింగ్, పేస్తో బౌలింగ్ చేయాలనే ఆలోచనవారికి ఉండదు...
అదే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఇండియాలో జరిగితే, న్యూజిలాండ్ భారీ జట్టుతో ఇక్కడికి వచ్చేది. అయినా మనోళ్లు వారిని మూడు రోజుల్లో ఆలౌట్ చేసేవాళ్లు. కానీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్లో జరుగుతోంది...
అది కూడా సమ్మర్లో జరుగుతున్న ఈ మ్యాచ్ కండీషన్స్ న్యూజిలాండ్కి బాగా కలిసివస్తాయి. అదీకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కి ముందు కివీస్, ఇంగ్లాండ్తో రెండు టెస్టులు కూడా ఆడుతోంది...
కీలకమైన ఫైనల్ మ్యాచ్ సమయానికి కుదురుకుని, ఫామ్లోకి రావడానికి వారికి కావాల్సినంత సమయం, ప్రాక్టీస్ దొరుకుతుంది...
ఎలా చూసుకున్నా ఫైనల్ మ్యాచ్ గెలవడానికి వారికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ మంజ్రేకర్.
‘రోహిత్ శర్మకి ఈ టెస్టు సిరీస్ చాలా కీలకం. స్వదేశాల్లో రాణిస్తున్నా, విదేశీ పిచ్లపై పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు రోహిత్. ఇప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది.
శుబ్మన్ గిల్ వంటి యంగ్ బౌలర్లకు ఎక్కడ బౌలింగ్ చేయాలో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి బాగా తెలుసు. ఒక్క మంచి లెంగ్త్ ఉన్న బంతి పడితే చాలు, గిల్ వికెట్ గిరాటేస్తుంది...
అతను ఆ లోపాన్ని సరిద్దికోకపోతే, ఈజీగా వికెట్ పారేసుకుంటాడు. ఛతేశ్వర్ పూజారా పర్ఫామెన్స్ ఎప్పటిలాగే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్కి వెన్నుముక కానుంది...
అజింకా రహానే కొద్దికాలంగా క్రికెట్ ఆడడం లేదు. అలాగే హనుమ విహారి, గత టూర్లో చక్కగా రాణించాడు. కాబట్టి అతనికి ప్లేస్ దక్కొచ్చు... వీళ్లంతా ఎలా రాణిస్తారో చూడాలి...
నా వరకూ విరాట్ కోహ్లీ బ్యాటుతో టీమిండియా మొదటి గేమ్ ఛేంజర్ అవుతాడు. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ 2 రిషబ్ పంత్... టాప్ 5 వికెట్లు పడిన తర్వాత మనోళ్ల బ్యాటింగ్ ఎలా సాగుతుందనేది మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ మంజ్రేకర్.