- Home
- Sports
- Cricket
- వచ్చే సీజన్లో సర్ఫరాజ్ను అలా వాడనున్న ఢిల్లీ క్యాపిటల్స్.. పంత్ యాక్సిడెంట్తో వేరే ఆప్షన్ లేకేనా..?
వచ్చే సీజన్లో సర్ఫరాజ్ను అలా వాడనున్న ఢిల్లీ క్యాపిటల్స్.. పంత్ యాక్సిడెంట్తో వేరే ఆప్షన్ లేకేనా..?
Sarfaraz Khan: దేశవాళీలో నిలకడగా రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్న ముంబై చిచ్చరపిడుగు సర్ఫరాజ్ ఖాన్ జాతీయ జట్టులోకి ఎప్పుడు వస్తాడో తెలియదు గానీ త్వరలో జరగాల్సి ఉన్న ఐపీఎల్ లో మాత్రం కీ రోల్ పోషించనున్నాడు.

ముంబై కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే వచ్చే 2023 సీజన్ లో సర్ఫరాజ్ ఖాన్ కు కీలక బాధ్యతలు అప్పజెప్పందేకు ఆ ఫ్రాంచైజీ ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీ సారథి రిషభ్ పంత్ కు కారు ప్రమాదం అయిన నేపథ్యంలో ఆ జట్టుకు మరో ఆప్షన్ లేకపోవడంతో ఈ నిర్ణయానికే ఓటేయనున్నట్టు తెలుస్తున్నది.
రిషభ్ పంత్ కెప్టెన్ తో పాటు ఢిల్లీకి వికెట్ కీపర్ గా కూడా చేసేవాడు. అయితే గత నెలలో కారు ప్రమాదంతో అతడికి తీవ్ర గాయాలై ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మార్చి మాసాంతంలో మొదలుకాబోయే ఐపీఎల్-2023 సీజన్ కు అతడు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు కెప్టెన్ తో పాటు వికెట్ కీపర్ కూడా కావల్సి వచ్చింది.
ఢిల్లీ క్యాపిటల్స్ గత ఏడాది డిసెంబర్ లో నిర్వహించిన మినీ వేలానికి ముందు తమ జట్టులో ఉన్న ఆంధ్రా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ ను రిలీజ్ చేసింది. తాజాగా పంత్ ప్రమాదంతో ఆ జట్టుకు వికెట్ కీపర్ అవసరం వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్లు ఎవరూ లేరు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఢిల్లీ యాజమాన్యం కూడా సర్ఫరాజ్ కు ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తున్నది.
ఇదే విషయమై సర్ఫరాజ్ ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అవును. నేను కూడా అది (పంత్ స్థానంలో సర్ఫరాజ్ వికెట్ కీపర్ గా రానున్నాడని) విన్నా. ప్రస్తుతం నేను రంజీలు ఆడుతున్నా. కొద్దిరోజుల్లో అది ముగియనుంది. మార్చి మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లకు ఒక క్యాంప్ ఏర్పాటు చేయనుంది.ఆ క్యాంప్ లో ఈ విషయంలో స్పష్టత రానుంది. అక్కడ జరిగే వర్క్ షాప్ లో అన్ని విషయాలు చర్చకు వస్తాయి...’అని అన్నాడు.
ఇదే విషయమై సర్ఫరాజ్ ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అవును. నేను కూడా అది (పంత్ స్థానంలో సర్ఫరాజ్ వికెట్ కీపర్ గా రానున్నాడని) విన్నా. ప్రస్తుతం నేను రంజీలు ఆడుతున్నా. కొద్దిరోజుల్లో అది ముగియనుంది. మార్చి మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లకు ఒక క్యాంప్ ఏర్పాటు చేయనుంది.ఆ క్యాంప్ లో ఈ విషయంలో స్పష్టత రానుంది. అక్కడ జరిగే వర్క్ షాప్ లో అన్ని విషయాలు చర్చకు వస్తాయి...’అని అన్నాడు.
రంజీలు, ఫస్ట్ క్లాస్ క్రికెట్ తో పోల్చితే ఐపీఎల్ చాలా డిఫరెంట్ అని.. ఇక్కడ దొరికిన అవకాశాలను వీలైనంత త్వరగా అందిపుచ్చుకోవాలని సర్ఫరాజ్ చెప్పాడు. ‘రంజీలలో నాలుగు రోజులు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. కానీ టీ20లలో అలా కాదు. ఉండేదే చాలా తక్కువ సమయం.. ఆ షార్ట్ టైమ్ లోనే మన బెస్ట్ ఇవ్వాలి.
ఐపీఎల్ లో నేను గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడినప్పుడు నన్ను ఫినిషర్ గా వాడేవాళ్లు. నాకు మిగిలేవే 3-4 ఓవర్లు. అప్పుడు నాకు పెద్దగా ఆడే ఆస్కారం కూడా దక్కలేదు. టెస్టు మ్యాచ్ ల మాదిరిగా టీ20లలో భారీ స్కోర్లు చేయడం అంత ఈజీ కాదు. కానీ నేను మాత్రం మూడు ఫార్మాట్ల మీద దృష్టిసారిస్తున్నా. రంజీలలోనే గాక సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే లలో కూడా పరుగులు సాధిస్తున్నా..’అని చెప్పాడు.