ధోనీ ఆ కోరిక ఇక తీరనట్టే... ఇంకో మూడేళ్లు ఆడతాడు, ఆ తర్వాత కూడా అతన్ని వదిలేది లేదు...
మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీకి ఓ కోరిక మాత్రం తీరకుండానే ఉండిపోయింది. అదే ఐపీఎల్ వేలంలో పాల్గొనడం. ఐపీఎల్ మొట్టమొదటి సీజన్లో 8 ఫ్రాంఛైజీలు మహేంద్ర సింగ్ ధోనీ కోసం బిడ్ చేశాయి. ఆ సీజన్లో మాహీని దక్కించుకున్న చెన్నై సూపర్ కింగ్స్, 13 సీజన్లుగా అతనినే కెప్టెన్గా కొనసాగిస్తోంది...
రెండు సీజన్లు నిషేధం తర్వాత కూడా మహేంద్ర సింగ్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్లో కెప్టెన్గా కొనసాగుతూనే ఉన్నాడు. దీంతో అతని కల నెరవేరనే లేదు...
ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు, తర్వాత సీజన్లో సీఎస్కే నుంచి బయటికి వచ్చి వేలంలో పాల్గోవాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ...
అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే, అతను చెన్నై సూపర్ కింగ్స్ నుంచి బయటికి వచ్చి ఐపీఎల్ 2021 వేలంలో పాల్గొనేవాడే. అయితే ఐపీఎల్ 2020 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా ఫెయిల్ అయ్యింది...
వరుస ఓటములతో ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచిన సీఎస్కే, మొత్తంగా పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి... ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ప్లేఆఫ్కి కూడా అర్హత సాధించలేకపోయింది...
2020 పరాభవం కారణంగా 2021 సీజన్ వేలంలో పాల్గొవాలనే తన కోరికను వాయిదా వేశాడు మాహీ... 2022 మెగా వేలం ఉండడంతో మాహీని బయటికి పంపేందుకు చెన్నై సూపర్ కింగ్స్ మొగ్గుచూపించవచ్చని భావించారంతా. అయితే సీఎస్కే మాత్రం మాహీని వదులుకోవడానికి సిద్ధంగా లేనట్టు ప్రకటించింది...
‘మాహీ ఇప్పుడు పూర్తి ఫిట్గా ఉన్నాడు. ఎంతో చురుకుగా ప్రాక్టీస్లో పాల్గొంటున్నాడు. ఎలా చూసినా ధోనీ ఇంకా రెండు, మూడు సీజన్లు ఆడడం గ్యారెంటీ. అందుకే అతన్ని వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం...
రిటైర్మెంట్ తర్వాత కూడా మహేంద్ర సింగ్ ధోనీ, సీఎస్కేతో ఉంటాడు. మాహీని మెంటర్గా, కోచ్గా అతని సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం...’ అంటూ తెలిపాడు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్...
‘కెప్టెన్గా, ప్లేయర్గా, లీడర్గా ఎంతో అనుభవం ఉన్న మాహీలాంటి ప్లేయర్ దొరకడం ఏ జట్టుకైనా అదృష్టమే. అతను ఇంకా జట్టుకి అవసరమైన అమూల్యమైన సేవలను అందించగలడని మేం నమ్ముతున్నాం... అతను వరల్డ్ బెస్ట్ ఫినిషర్’ అంటూ కామెంట్ చేశాడు కాశీ విశ్వనాథ్...
ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీకి ఏటా రూ.15 కోట్లు చెల్లిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2022 మెగా వేలానికి వదిలి వేయకపోతే, మరో మూడేళ్ల పాటు ఈ భారీ మొత్తాన్ని మాహీకి చెల్లించాల్సి ఉంటుంది...
ఇప్పటికే ఐపీఎల్ ద్వారా రూ.150+ కోట్లు ఆర్జించిన ఏకైక, మొట్టమొదటి ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ... వేలానికి రాకపోతే త్వరలోనే రూ.200+ కోట్ల క్లబ్లో కూడా చేరబోతున్నాడు...