MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • భారత జట్టులోకి ధోనీ.. గంభీర్ ఏం చేస్తారో మరి !

భారత జట్టులోకి ధోనీ.. గంభీర్ ఏం చేస్తారో మరి !

MS Dhoni: 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టుకు మెంటర్‌గా ఎంఎస్ ధోనీని మళ్లీ బీసీసీఐ ఆహ్వానించిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా ఉన్నందున ధోనీ దీనికి అంగీకరిస్తారా అన్నదే పెద్ద ప్రశ్న. ఎందుకో తెలుసుకుందాం. 

2 Min read
Mahesh Rajamoni
Published : Aug 30 2025, 08:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ధోనీకి బీసీసీఐ బిగ్ ఆఫర్
Image Credit : Getty

ధోనీకి బీసీసీఐ బిగ్ ఆఫర్

లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని మళ్లీ భారత జట్టులోకి వస్తున్నారు. ఈ సారి ఆయన కొత్త పాత్రలో కనిపించనున్నారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మరోసారి కీలకమైన రోల్ ను ఇచ్చేందుకు ఆహ్వానం పలికిందని క్రిక్‌బ్లాగర్‌ నివేదిక పేర్కొంది. 

ధోనీకి మెంటర్ రోల్ ను ఆఫర్ చేసింది. 2021 టీ20 ప్రపంచకప్ సమయంలో తాత్కాలికంగా ఇచ్చిన బాధ్యతతో పోలిస్తే, ఈసారి ధోనీకి ఎక్కువ కాలం బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది. భారత క్రికెట్ భవిష్యత్తును నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని రిపోర్టు పేర్కొంది.

DID YOU
KNOW
?
టీమిండియా కెప్టెన్ గా ధోని రికార్డులు
ఎంఎస్ ధోనీ టీమిండియా కెప్టెన్‌గా 3 ఐసీసీ ట్రోఫీలు గెలిపించారు. అవి 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ. క్రికెట్ చరిత్రలో ఈ మూడు ప్రధాన ఐసీసీ టైటిల్స్ గెలిచిన ఏకైక కెప్టెన్ ధోని.
26
ధోనీ అనుభవం భారత జట్టుకు బలం
Image Credit : Getty

ధోనీ అనుభవం భారత జట్టుకు బలం

ఈ ఆఫర్ ప్రకారం ధోనీ కేవలం సీనియర్ పురుషుల జట్టుకే కాకుండా, జూనియర్స్, మహిళా జట్లకు కూడా మార్గదర్శకత్వం వహించాల్సి ఉంటుంది. “భారత క్రికెట్‌కు మళ్లీ మెంటర్‌గా ధోనీని ఆహ్వానిస్తున్నాం” అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయని నివేదికలో పేర్కొన్నారు. మళ్లీ ధోని జట్టులోకి వస్తే మరింత బలంగా టీమిండియా మారుతుందని క్రికెట్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.

Related Articles

Related image1
కోహ్లీ, రోహిత్, పుజారా లకు సచిన్‌ లాంటి అదృష్టం లేదు !
Related image2
రాహుల్ ద్రావిడ్: ఐపీఎల్ 2026 కు ముందు రాజస్థాన్ రాయల్స్ కు బిగ్ షాక్
36
2020 రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ లో ఆడుతున్న ధోనీ
Image Credit : Getty

2020 రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ లో ఆడుతున్న ధోనీ

ధోనీ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికినప్పటికీ, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) తరఫున ఇంకా ఆడుతున్నారు. ఆయన బీసీసీఐ వ్యవహారాల్లో పాల్గొనకపోయినా.. భారత క్రికెట్ లోనే కాకుండా అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. ఆయన అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తోంది. జూనియర్ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో ధోనీ భాగస్వామ్యం కీలకమని బోర్డు నమ్ముతోంది. అందుకే మళ్లీ జట్టులోకి రావాలని కోరుతోందని సమాచారం.

46
గంభీర్‌తో ధోని కలిసి పనిచేస్తారా?
Image Credit : Instagram/House of Events

గంభీర్‌తో ధోని కలిసి పనిచేస్తారా?

అయితే, బీసీసీఐ ఆఫర్‌ను ధోని అంగీకరిస్తారా? అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే, ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఉన్నారు. గతంలో ఆటగాళ్లుగా ఉన్నప్పుడు వీరిద్దరి సంబంధం అంత బలంగా ఉండేది కాదు. ఐసీసీ ట్రోఫీ గెలిచిన జట్టులో ఈ ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు. 

గంభీర్ కూడా మంచి ప్రదర్శన చేశారు. అయితే, భారత  జట్టు గెలుపులో ధోనికే ఎక్కువ గుర్తింపు వచ్చింది. జట్టుగా ప్రదర్శన ఇవ్వడంతోనే భారత్ విజయం సాధించిందనే విషయాన్ని గంభీర్ చాలా సార్లు ప్రస్తావించారు. ఇద్దరికి పడదు అనేది క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి గంభీర్ క్రింద పనిచేయడానికి ధోనీ సిద్ధపడతారా అన్నది పెద్ద ప్రశ్న.

56
అలా అయితే ధోని ఐపీఎల్ ఆడకపోవచ్చు !
Image Credit : ANI

అలా అయితే ధోని ఐపీఎల్ ఆడకపోవచ్చు !

ధోనీ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున ఆడుతున్నారు. 2026 ఐపీఎల్ సీజన్ కూడా ఆడతారని సమాచారం. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ మెంటర్ పాత్రను స్వీకరిస్తే, కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ధోనీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ధోని మెంటర్ గా బీసీసీఐతో కలిస్తే ఇకపై ఐపీఎల్ లో ఆడకపోవచ్చు.

66
2026 ప్రపంచ కప్ గెలుపే లక్ష్యం
Image Credit : Getty

2026 ప్రపంచ కప్ గెలుపే లక్ష్యం

2021లో ధోనీ మెంటర్‌గా ఉన్నప్పటికీ టీమిండియా సెమీఫైనల్స్ చేరుకోలేకపోయింది. ఆ టోర్నీలో భారత్ ఐదు మ్యాచ్‌ల్లో మూడే గెలిచింది. అయితే, ఆ సమయంలో ఆటగాళ్లు ధోనీ ఇచ్చిన సలహాలను చాలా విలువైనవిగా భావించారు. ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్‌ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 

అంతేకాకుండా, 2024లో టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20 క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త తరం ఆటగాళ్లకు ధోనీ మార్గదర్శకత్వం అత్యంత కీలకం అవుతుందని బోర్డు భావిస్తోంది.

మరి ధోనీ ఆఫర్‌ను అంగీకరిస్తారా లేదా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ఆయన మెంటర్‌గా చేరితే, టీమిండియా 2026 వరల్డ్ కప్‌లో బలమైన జట్టుగా నిలుస్తుందని బీసీసీఐ నమ్ముతోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఎం.ఎస్. ధోని
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved