ఐపీఎల్లో మాహీ భాయ్ ఒక్కడే తోపు! ఏ ప్లేయర్ని అయినా వాడుకోగలడు... సురేష్ రైనా కామెంట్...
ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. 2008 నుంచి 2023 వరకూ కెప్టెన్గా కొనసాగుతున్న ఏకైక కెప్టెన్ ధోనీ ఒక్కడే. చెన్నై సూపర్ కింగ్స్కి నాలుగు టైటిల్స్ అందించిన మాహీ, 2023 సీజన్ తర్వాత రిటైర్ కాబోతున్నాడు...
ఐపీఎల్ 2023ని ధోనీ ఫేర్వెల్ సీజన్గా ప్రచారం చేస్తోంది చెన్నై సూపర్ కింగ్స్... మూడేళ్ల తర్వాత సొంత స్టేడియంలో మ్యాచులు ఆడబోతోంది సీఎస్కే. మాహీకి ఆప్త మిత్రుడిగా ఉన్న సురేష్ రైనా... సీఎస్కే కెప్టెన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...
‘ధోనీ బౌలర్ల కెప్టెన్. మేం అందరం అతని కెప్టెన్సీలో ఆడాం. మాహీ ప్లేయర్లలో పాజిటివిటీని నింపుతాడు. ఐపీఎల్లో ధోనీ కంటే పెద్ద ప్లేయర్ లేడు...
వరల్డ్ బెస్ట్ ఫినిషర్. ప్లేయర్ల నుంచి బెస్ట్ పర్ఫామెన్స్ రాబట్టడంలో ధోనీని మించిన వాళ్లు లేరు.. మాహీ స్పెషాలిటీ ఇదే... ఐపీఎల్లో అతనే తోపు.. ’ అంటూ కామెంట్ చేశాడు ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా...
‘ధోనీలో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతీ ఒక్క ప్లేయర్లో ఉన్న స్పెషల్ టాలెంట్స్ ఏంటో అతనికి బాగా తెలుసు. సురేష్ రైనాలోని 100 శాతం వాడగలడు. ప్రతీ ప్లేయర్లోనూ చాలా టాలెంట్ ఉంటుంది. అయితే దాన్ని బయటికి తీయడం అందరి వల్ల కాదు.
మాహీ మాత్రం అందరి నుంచి నూరు శాతం రిజల్ట్ రాబట్టగలడు. అందుకే ఏ ప్లేయర్ అయినా ధోనీ కెప్టెన్సీలో ఆడితే స్టార్గా మారతాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్...