కేకేఆర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా పాజిటివ్... కేకేఆర్ జట్టును వదలని భయం...
ఐపీఎల్ 2021 సీజన్ను అర్ధాంతరంగా వాయిదా వేసినా, కరోనా పాజిటివ్ కేసులు మాత్రం వెలువడుతూనే ఉన్నాయి. ఐపీఎల్లో కరోనా కలకలం రేగడానికి ప్రధాన కారణమైన కోల్కత్తా నైట్రైడర్స్ జట్టులోనే మరో ప్లేయర్కి కరోనా పాజిటివ్ వచ్చింది...
కోల్కత్తా నైట్రైడర్స్ యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కేకేఆర్ నుంచి కరోనా పాజిటివ్గా తేలిన మూడో ప్లేయర్గా నిలిచాడు ప్రసిద్ధ్ కృష్ణ.
మే 3న కోల్కత్తా నైట్రైడర్స్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఆ రోజు జరగాల్సిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ వాయిదా పడింది...
ఆ తర్వాత సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ జట్టులోని ప్లేయర్లకు కూడా కరోనా పాజిటివ్ సోకినట్టు తేలడంతో అర్ధాంతరంగా సమావేశమైన యాజమాన్యం... ఐపీఎల్ 2021 సీజన్ను వాయిదా వేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది.
సీజన్ మధ్యలో గాయపడిన వరుణ్ చక్రవర్తి, స్కానింగ్ కోసం బయో బబుల్ను దాటి ఆసుపత్రికి వెళ్లి వచ్చాడని... క్వారంటైన్లో ఉండాల్సి వస్తుందనే కారణంగా ఆ విషయాన్ని దాచిపెట్టాడని తేలింది...
ఇప్పటికే ఫిట్నెస్ పరీక్షలో ఫెయిల్ అయి, తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన వరుణ్ చక్రవర్తి... నిర్లక్ష్యవైఖరితో ఐపీఎల్ 2021 సీజన్ మొత్తం వాయిదా పడడానికి కారణమయ్యాడంటూ వార్తలు వచ్చాయి...
కేకేఆర్ బృందంలో ఇద్దరు ప్లేయర్లకు పాజిటివ్ రావడంతో జట్టును మొత్తం క్వారంటైన్లో పెట్టారు అధికారులు. మిగిలిన జట్ల ప్లేయర్లు ఇప్పటికే స్వదేశానికి చేరుకున్నా, ఇయాన్ మోర్గాన్ ఇక్కడే ఉండిపోయాడు.
తాజాగా ప్రసిద్ధ్ కృష్ణకి పాజిటివ్ రావడంతో అతను మరికొన్ని రోజులు ఐసోలేషన్లో ఉండబోతున్నాడు. ఇయాన్ మోర్గాన్కి నెగిటివ్ రావడంతో అతను స్వదేశానికి పయనం కానున్నాడు.
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కి ఎంపిక చేసిన జట్టులో స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికైన ప్రసిద్ధ్ కృష్ణ... ఇప్పటికే టీమిండియా తరుపున పొట్టి ఫార్మాట్లో ఆరంగ్రేటం చేశాడు.