మొత్తానికి కేన్ మామనే బకరా చేస్తారు... సన్రైజర్స్పై వసీం జాఫర్ కామెంట్..
ఐపీఎల్ 2021 సీజన్లో ఘోర పరాభవం తర్వాత 2022 సీజన్ జట్టులో పూర్తి మార్పులు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. కేన్ విలియంసన్, భువనేశ్వర్ కుమార్ వంటి ఒకరిద్దరు ప్లేయర్లు తప్ప మిగిలిన అందరూ కొత్తవాళ్లే...

ఐపీఎల్ 2022 సీజన్లో ఏ మాత్రం ప్లానింగ్ లేకుండా ప్లేయర్లను కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్....
గత సీజన్లో నాలుగు సార్లు డకౌట్ అయ్యి, 12 మ్యాచుల్లో కలిపి 85 పరుగులు మాత్రమే చేసిన నికోలస్ పూరన్ని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది సన్రైజర్స్...
గత సీజన్లో నాలుగు సార్లు డకౌట్ అయ్యి, 12 మ్యాచుల్లో కలిపి 85 పరుగులు మాత్రమే చేసిన నికోలస్ పూరన్ని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది సన్రైజర్స్...
ఇక్కడి వారికి పెద్దగా తెలియని విండీస్ ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్ కోసం ఏకంగా రూ.7.75 కోట్లు చెల్లించడానికి సిద్ధమైంది...
ఉన్నంతలో ఆరెంజ్ ఆర్మీ కొనుగోలు చేసిన ప్లేయర్లలో రాహుల్ త్రిపాఠి ఒక్కడే కాస్త కూస్తో మంచి ప్లేయర్.. అని ఫ్యాన్స్ వాదన...
అయితే అయిడిన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, అభిషేక్ శర్మ వంటి ప్లేయర్లతో సన్రైజర్స్ హైదరాబాద్కి బ్యాటింగ్ ఆర్డర్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది...
‘సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు. సాధారణంగా కెప్టెన్ కేన్ విలియంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్కి వస్తుంటాడు..
ఇప్పుడు నికోలస్ పూరన్, అభిషేక్ శర్మ వంటి ప్లేయర్ల రాకతో వన్డౌన్లో ఎవరిని పంపాలనే విషయంలో సందిగ్ధత వస్తుంది...
ఒకవేళ పూరన్ కోసం, లేదా ఏ మాత్రం అనుభవం లేని అభిషేక్ శర్మ కోసం కేన్ విలియంసన్ తన స్థానాన్ని ఎదుర్కొంటే... అతను బకరా అయినట్టే...’ అంటూ కామెంట్ చేశాడు వసీం జాఫర్..