ఐపీఎల్లో ధోనీ గ్రేటెస్ట్ ఫినిషర్, ఆ ప్లేస్ని ఎవ్వరూ రిప్లేస్ చేయలేరు... ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యలు...
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే పడనివాళ్లు చాలామందే ఉంటారు. వారిలో గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. మాహీ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన వీరంతా, ధోనీ అంటే పెద్దగా ఇష్టపడరు. అయితే ఇర్ఫాన్ పఠాన్ మాత్రం ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు..
Image Credit: Getty Images (File Photo)
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో వరుసగా 6,4,2,6 బాది... 16 పరుగులు చేసి మ్యాచ్ని ముగించాడు సీఎస్కే మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ...
ఈ ఇన్నింగ్స్పై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్... ‘ఐపీఎల్ చరిత్రలో ఎమ్మెస్ ధోనీ గ్రేటెస్ట్ ఫినిషర్. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు... ఏళ్లు గడిచేకొద్దీ ఐపీఎల్లో చాలామంది యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు...
అయితే ఎంత మంది వచ్చినా ఎమ్మెస్ ధోనీ ప్లేస్ను రిప్లేస్ చేయడం ఎవరి తరం కాదు. ఐపీఎల్కి అసలైన అంబాసిడర్ ఎమ్మెస్ ధోనీయే...
మాహీ తర్వాత ఏబీ డివిల్లియర్స్... ఐపీఎల్లో బిగ్గెస్ట్ ఫినిషర్. అయితే ధోనీ ఎప్పుడూ ఏబీ డివిల్లియర్స్ కంటే ముందే ఉంటారు. మాహీ గ్రేటెస్ట్..
ఈ సీజన్లో రాహుల్ తెవాటియా, దినేశ్ కార్తీక్, సిమ్రాన్ హెట్మయర్ వంటి ప్లేయర్లు కొన్ని మ్యాచ్లను ఫినిష్ చేసి, తన టీమ్స్ని గెలిపించారు. అయితే అల్టిమేట్ ఫినిషర్ అంటే మాహీయే...
చెన్నై సూపర్ కింగ్స్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఓటమి అంచుల్లో నుంచి విజయాన్ని ఎలా అందుకోవాలో సీఎస్కేకి బాగా తెలుసు...
ఇంతకుముందు చాలా సార్లు సీఎస్కే వరుస ఓటములు ఎదుర్కొన్న తర్వాత అసాధారణ రీతిలో కమ్బ్యాక్ ఇచ్చింది. అందుకే ఐపీఎల్లో చెన్నై చాలా డేంజరస్ టీమ్...’ అంటూ చెప్పుకొచ్చాడు...
ఐపీఎల్ కెరీర్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్డెవిల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్జెయింట్స్, గుజరాత్ లయన్స్ జట్ల తరుపున ఆడాడు ఇర్ఫాన్ పఠాన్...