సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ పార్ట్... ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే...
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచ్లకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్లో ఇంగ్లాండ్ టూర్ ముగిసిన తర్వాత ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులను యూఏఈ వేదికగా నిర్వహించబోతున్నట్టు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా షెడ్యూల్కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2021లో మిగిలిన మ్యాచులకు సంబంధించిన పార్ట్ 2 సీజన్ అందరూ ఊహించినట్టుగానే సెప్టెంబర్ 19న ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు ఓ అధికారి తెలిపాడు. ఫైనల్ మ్యాచ్లో అక్టోబర్ 15న జరుగుతుంది. అంటే 26 రోజుల్లో 31 మ్యాచులు పూర్తి చేస్తారు.
2021 సీజన్లో ఇప్పటికే 29 మ్యాచులు పూర్తయిన విషయం తెలిసిందే. 29 మ్యాచులు పూర్తయిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో ఐపీఎల్ 2021 సీజన్ను అర్ధాంతరంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
భారత్లో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, సెప్టెంబర్ మాసంలో ఇక్కడ వర్షాకాలం ఉండడం, మ్యాచులు నిర్వహించడం కష్టం అవుతుందని భావించిన బీసీసీఐ... మ్యాచులను గత సీజన్ నిర్వహించిన యూఏఈ వేదికగా జరపాలని నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ 2021 సీజన్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మిగిలిన మ్యాచులు జరుగుతాయి. అయితే డబుల్ హెడెడ్ మ్యాచులను పెంచి, సీజన్ను త్వరగా ముగించాలని భావిస్తోంది బీసీసీఐ...
8 డబుల్ హెడెడ్ మ్యాచులతో జరిగే పార్ట్ 2 సీజన్లో ముందుగా అనుకున్నట్టుగానే ఎలిమినేటర్, క్వాలిఫైయర్ మ్యాచులతో పాటు ఫైనల్ని కూడా ఒకే వేదికగా నిర్వహించబోతున్నారని సమాచారం....
యూఏఈ వేదికగా జరిగే మ్యాచ్లకు 30 శాతం కెపాసిటీతో ప్రేక్షకులను అనుమతించబోతున్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న ప్రేక్షకులకు మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్లో ఉన్న భారత జట్టు, సెప్టెంబర్ 14న ఈ టూర్ను ముగించుకుంటుంది. అటు నుంచి నేరుగా యూఏఈ చేరుకుంటారు భారత క్రికెటర్లు...
షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 10న ప్రారంభమయ్యే ఐదో టెస్టు, ఐదు రోజుల పాటు పూర్తిగా సాగినా... భారత క్రికెటర్లు యూఏఈ చేరుకుని, అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి 5 రోజుల సమయం ఉంటుంది.
బయో బబుల్ నుంచే వస్తుండడంతో ఇంగ్లాండ్ టూర్లో ఉన్న ప్లేయర్లకు మళ్లీ క్వారంటైన్ అవసరం లేకుండానే లీగ్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని చూస్తోంది బీసీసీఐ... అదీకాకుండా అప్పటికే భారత క్రికెటర్లు రెండు డోస్ల కరోనా వ్యాక్సిన్ వేసుకుంటారు కాబట్టి క్వారంటైన్ రూల్ను ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదని బీసీసీఐ భావిస్తోంది.
భారత్లో ఉన్న క్రికెటర్లు మాత్రం పది రోజుల ముందుగానే యూఏఈ చేరుకుంటారు. వారితో పాటు ఆఫ్ఘాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా క్రికెటర్లు ఐపీఎల్ 2021 సీజన్ మిగిలిన మ్యాచుల్లో పాల్గొనే అవకాశం ఉంది.