MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్ 2021 హంగామా మళ్లీ మొదలైంది... చెన్నైకి చేరుకున్న సీఎస్‌కే ప్లేయర్లు...

ఐపీఎల్ 2021 హంగామా మళ్లీ మొదలైంది... చెన్నైకి చేరుకున్న సీఎస్‌కే ప్లేయర్లు...

ఐపీఎల్ 2021 హంగామా మళ్లీ మొదలైంది. ఇప్పటికే ఇండియాలో 29 మ్యాచులు ముగించుకున్న 14వ సీజన్, మిగిలిన 31 మ్యాచుల కోసం యూఏఈని వేదికగా ఎంచుకున్న విషయం తెలిసిందే. ఈ సెకండ్ ఫేజ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ అప్పుడే ప్రాక్టీస్ మొదలెట్టేసింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 11 2021, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

ఐపీఎల్ 2021 సీజన్ కోసం చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్‌ క్యాంపుని ప్రారంభించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న సీఎస్‌కే ప్లేయర్లు అందరూ చెన్నైలోని ఈ క్యాంపుకి చేరుకున్నారు...

211

ఇప్పటికే వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. ఆగస్టు 20 వరకూ చెన్నైలోనే ప్రాక్టీస్ చేయనున్నారు సీఎస్‌కే ప్లేయర్లు...

311

చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎన్ జగదీశన్, రుతురాజ్ గైక్వాడ్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ చాహార్, రాబిన్ ఊతప్ప, కెఎమ్ అసిఫ్... ఈ క్యాంపులో పాల్గొంటున్నారు...

411

ఆగస్టు 20 వరకూ చెన్నైలో ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత యూఏఈకి పయనమవుతుంది సీఎస్‌కే జట్టు. కరోనా కారణంగా అమలులో ఉన్న ఆంక్షల కారణంగా సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్‌తో మిగిలిన సహాయ సిబ్బంది నేరుగా దుబాయ్ చేరుకుని, జట్టుతో కలుస్తారు..

511

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అనే టాక్ వినబడుతోంది. ధోనీ అభిమానులతో పాటు ఆయన ఆప్తమిత్రుడు సురేష్ రైనా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు..

611

అయితే ఈ సీజన్‌లో టైటిల్ గెలిచి, ధోనీని మరో సీజన్‌ ఆడేలా ఒప్పిస్తానని కామెంట్ చేశాడు సురేష్ రైనా. గత సీజన్‌లో దారుణమైన పర్ఫామెన్స్ కారణంగా తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు మహేంద్ర సింగ్ ధోనీ...

711

యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ఈ సీజన్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది...

811

కరోనా కారణంగా సీజన్‌కి బ్రేకులు పడే సమయానికి మొదటి ఏడు మ్యాచుల్లో ఐదింట్లో గెలిచి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది...

911

సీఎస్‌కే విజయాల్లో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజాతో పాటు సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ... ప్రస్తుతం ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్‌లో పాల్గొంటున్నారు... వీరంతా నేరుగా ఇంగ్లాండ్ నుంచి యూఏఈ చేరనున్నారు..

1011

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ సెప్టెంబర్ 14న ముగుస్తుంటే, సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ సీజన్ తిరిగి ప్రారంభం కానుంది... సీజన్ రీలాంఛ్‌లో మొదటి మ్యాచ్‌ సీఎస్‌కే, ముంబై మధ్య జరగనుంది...

1111

అయితే బయో బబుల్ టూ బయో బబుల్ ట్రాన్స్‌ఫర్‌కి బీససీఐ అనుమతినిచ్చింది. దీంతో నేరుగా ఇంగ్లాండ్ నుంచి ఎలాంటి క్వారంటైన్ అవసరం లేకుండానే ఐపీఎల్ జట్లతో కలవబోతున్నారు క్రికెటర్లు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : ఛాన్స్ మిస్ అయితే ఇంటికే.. సూపర్ 8లో వర్షం పడితే టీమిండియా పరిస్థితి ఏంటి?
Recommended image2
T20 World Cup: సూప‌ర్ 8కి ముందు కీల‌క మార్పులు.. ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి స్టార్ ప్లేయ‌ర్‌.?
Recommended image3
Sanju Samson : ఖేల్ ఖతం దుకాణం బంద్.. ఏషియన్ గేమ్స్ 2026 నుండి సంజూ శాంసన్ ఔట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved