IPL 2020: భార్యతో కలిసి ‘కపుల్ యోగా’ చేసిన రైనా... ట్రైయినర్ను మిస్ అవుతున్నానంటూ...
IPL 2020 సీజన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా. తన మామ ఇంటిపై దుండగులు దాడి చేయడంతో సీజన్ ప్రారంభానికి ముందే స్వదేశానికి తిరిగొచ్చాడు రైనా.
‘మిస్టర్ ఐపీఎల్’గా పేరొందిన సురేశ్ రైనా లేకపోవడంతో సరైన విజయాలు అందుకోలేకపోతోంది చెన్నై సూపర్ కింగ్స్...
ఇప్పటిదాకా జరిగిన 6 మ్యాచుల్లో నాలుగింట్లో ఓడింది ధోనీ సేన...
చెన్నై వరుస పరాజయాలు అందుకుంటుండడంతో ధోనీ అండ్ కో ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి...
సీజన్కి దూరంగా ఉన్న సురేశ్ రైనాను, హర్భజన్ సింగ్ను జట్టు నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది సీఎస్కే...
జట్టుకు దూరమైన సురేశ్ రైనా, భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్నాడు...
భార్య ప్రియాంక రైనాతో కలిసి ‘కపుల్ యోగా’ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు సురేశ్ రైనా...
జమ్మూలో క్రికెట్ అకాడమీ పెట్టాలని భావిస్తున్న సురేశ్ రైనా, ఆ పనుల నిమిత్తం భార్యకు దూరంగా ఉన్నాడు...
ప్రియాంక రైనా ఫేమస్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్.. ఇప్పటిదాకా ఆమె తొమ్మిదేళ్లుగా 8 చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ప్రియాంక, సురేశ్ రైనాకి గ్రేసియా అనే నాలుగేళ్ల కూతురు ఉంది...
ఈ ఫోటోపై కూడా చెన్నై జట్టుకి తిరిగి రావాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు సీఎస్కే ఫ్యాన్స్...
అయితే రైనా వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇచ్చేందుకు అతన్ని తిరిగి రమ్మని కోరడం లేదని తెలిపాడు సీఎస్కే మేనేజర్ శ్రీనివాస్.