IPL 2020: షారుక్! ఇదేం పని... బాలీవుడ్ బాద్షా కుటుంబంపై ట్రోలింగ్...
IPL 2020 సీజన్లో షారుక్ ఫ్రాంఛైజీ కోల్కత్తా నైట్రైడర్స్ నిలకడగా ఆడుతోంది. ఆడిన ఐదు మ్యాచుల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లో 168 పరుగులు మాత్రమే చేసి, విజయం అందుకుంది. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్లో అన్యూహ్యంగా పుంజుకుని విక్టరీ కొట్టింది కోల్కత్తా నైట్రైడర్స్. ఈ మ్యాచ్కు షారుక్ ఖాన్, కుటుంబంతో సహా హాజరయ్యాడు.
సెప్టెంబర్ 30న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్కు కుటుంబంతో సహా హాజరయ్యాడు షారుక్ ఖాన్...
యజమాని హాజరైన ఈ మ్యాచ్లో విజయం సాధించింది కేకేఆర్ జట్టు..
షారుక్తో పాటు ఆయన భార్య గౌరీ ఖాన్, కూతురు సుహానా ఖాన్, కొడుకు అయాన్ గ్యాలరీ నుంచి కోల్కత్తా జట్టును ఉత్సాహపరిచారు.
కోవిద్ నిబంధనల ప్రకారం షారుక్, గౌరీ, సుహానా, కొడుకు అర్యన్.. ఎవ్వరూ మాస్క్ వేసుకోలేదు.
మ్యాచ్ జరుగుతున్నంతసేపు మాస్క్ లేకుండానే అటు ఇటు తిరుగుతూ వీడియోలో కనిపించారు షారుక్ ఫ్యామిలీ.
దీంతో షారుక్ అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు ఐపిఎల్ ఫ్యాన్స్...
కోవిద్ కారణంగా యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లకు హాజరవుతూ మాస్క్ ధరించాలనే కనీస అవగాహన లేకుండా ప్రవర్తించడం ఏంటని నిలదీశారు...
ట్రోల్స్ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్కి మాస్కులతో వచ్చారు షారుక్, గౌరీ, సుహానా..
షారుక్, గౌరీ, సుహానా మాస్క్ వేసుకుని కనిపించినా... కొడుకు అర్యన్ మాత్రం మాస్క్ వేసుకోలేదు...
ట్రోల్స్ వచ్చిన తర్వాత కూడా ఆర్యన్ అదే విధంగా ప్రవర్తించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇంతకుముందు ఇండియాలో జరిగిన కొన్ని మ్యాచ్లకు షారుక్ తాగేసి వచ్చి గొడవ చేసి, బ్యాన్కు గురైన సంగతి తెలిసిందే.