IPL 2020: ఫ్యూచర్ ధోనీ అతనే... - బ్రియాన్ లారా...
IPL 2020 సీజన్ 13 ఆరంభానికి ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు మహేంద్ర సింగ్ ధోనీ. భారత జట్టు వికెట్ కీపర్గా అద్భుతంగా రాణించిన ధోనీ ప్లేస్కి సరైన ప్లేయర్ని వెతికి పట్టుకోవడం సెలక్టర్లకి ఛాలెంజింగ్ పని. అయితే ధోనీకి అతనే సరైన రిప్లేస్మెంట్ అంటున్నాడు దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా.
ఈ సీజన్లో ఇప్పటిదాకా జరిగిన 5 మ్యాచుల్లో 171 పరుగులు చేశాడు రిషబ్ పంత్... అయితే ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు పంత్.
సంజూ శాంసన్ 5 మ్యాచుల్లో 171 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ సీజన్లో 16 సిక్సర్లు బాదిన సంజూ శాంసన్, హైయెస్ట్ సిక్సర్లు బాదిన క్రికెటర్గా కొనసాగుతున్నాడు...
రిషబ్ పంత్, సంజూ శాంసన్లలో పంత్ బెటర్ అంటున్నాడు బ్రియాన్ లారా...
రెండు మ్యాచుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన సంజూ శాంసన్, ఆ తర్వాత మూడు మ్యాచుల్లో విఫలమయ్యాడు...
పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయినా నిలకడగా రాణిస్తున్నాడు రిషబ్ పంత్... 42.75 యావరేజ్తో పరుగులు చేస్తున్నాడు.
‘గతంతో పోలిస్తే రిషబ్ పంత్ ఆటతీరులో చాలా మార్పు వచ్చింది...
నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకునే పంత్, ఈ సీజన్లో అలా చేయడం లేదు...
రిషబ్ పంత్ ఆటతీరులో ఎంతో మెచ్యూరిటీ వచ్చింది...’ అని చెప్పుకొచ్చాడు బ్రియాన్ లారా...
మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా ధోనీ ప్లేస్ కోసం పోటీ పడుతున్నాడు.
ఆరు మ్యాచుల్లో ఓ సెంచరీతో 2 హాఫ్ సెంచరీలతో 313 పరుగులు చేశాడు కెఎల్ రాహుల్...
ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్న కెఎల్ రాహుల్ కంటే రిషబ్ పంత్ బెటర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అంటున్నాడు బ్రియాన్ లారా...