IPL 2020: క్రిస్గేల్కి ఫుడ్ పాయిజన్... ఆసుపత్రిలో ఎలాంటి ఫోజ్ ఇచ్చాడో చూడండి...
IPL 2020 సీజన్లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడని ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్... ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రి బెడ్ మీద క్రేజ్ స్టిల్, తర్వాతి మ్యాచ్లో గేల్ బరిలో దిగే అవకాశం...
IPL చరిత్రలో అత్యధికంగా ఆరు సెంచరీలు బాదిన క్రికెటర్ క్రిస్ గేల్.
ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ కూడా గేల్.
‘యూనివర్సల్ బాస్’గా పేరొందిన క్రిస్ గేల్ పేరిట ఐపీఎల్లో ఎన్నో రికార్డులు ఉన్నాయి.
గేల్ క్రీజులో ఉంటే, ఎలాంటి బౌలర్ అయినా భయపడాల్సిందే. ఈ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడుతున్న క్రిస్ గేల్, ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
పంజాబ్ ఎదుర్కొంటున్న వరుస ఓటములకు క్రిస్ గేల్ జట్టులో లేకపోవడం కూడా ఓ కారణం.
క్రిస్ గేల్కి ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరాడు.
ఆసుపత్రి బెడ్ మీద కళ్లకు కీర దోస కాయ, నోట్లో క్యారెట్... చేతిలో వాటర్ గ్లాస్... మరో చేతిలో టెలిఫోన్ పట్టుకొని స్టైలిష్ స్టిల్ ఇచ్చాడు క్రిస్ గేల్.
‘నేనెప్పుడూ పోరాడానికి వెనుకాడను. ఎందుకంటే నేనే యూనివర్సల్ బాస్ని’ అంటూ ఫోటో కింద కామెంట్ పెట్టాడు క్రిస్ గేల్.
డిఫరెంట్ యాటిట్యూడ్, బిహేవియర్తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ కరేబియన్ వీరుడు, తర్వాతి మ్యాచ్లో తప్పకుండా బరిలో దిగే అవకాశం ఉంది.
ఏడు మ్యాచుల్లో ఆరింట్లో ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... ప్లేఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఇకపై ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే..