IPL 2020: సన్రైజర్స్కి షాక్... గాయంతో భువనేశ్వర్ ఐపీఎల్కు దూరం...
IPL 2020లో సన్రైజర్స్ హైదరాబాద్కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా మిచెల్ మార్ష్ జట్టుకి దూరం కాగా, ఇప్పుడు మరో స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఐపీఎల్కు దూరమయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 18వ ఓవర్లో ఒకే ఒక్క బంతి వేసిన భువనేశ్వర్ కుమార్, తర్వాతి బంతి వేయడానికి ఇబ్బంది పడ్డాడు.
ఫిజియో పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నా... బాల్ వేయలేక తప్పుకున్నాడు.
భువీకి అయిన గాయం తీవ్రం కావడంతో కోలుకోవడానికి చాలా సమయం పడుతున్నారు తేల్చారు వైద్యులు.
భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన సిద్ధార్థ్ కౌల్, ముంబైపై మ్యాచ్లో 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చాడు.
ఇప్పుడు పూర్తి సీజన్ నుంచి భువీ తప్పుకోవడంతో అతని స్థానంలో సరైన పేసర్ను పట్టుకోవడం సన్రైజర్స్ హైదరాబాద్కి సవాల్గా మారనుంది.
గాయం కారణంగా నవంబర్లో ముగిసే ఐపీఎల్తో పాటు ఆ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్కి కూడా దూరం కానున్నాడు భువనేశ్వర్ కుమార్.
2016, 2017 సీజన్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి పర్సుల్ క్యాప్ అందుకున్నాడు భువనేశ్వర్ కుమార్.
భువనేశ్వర్ కుమార్: మొదటి రెండు మ్యాచుల్లో ఇబ్బందిపడిన భువీ, గత మ్యాచ్లో ఫామ్లోకి వచ్చినట్టు కనిపించాడు. భువీ లేకపోవడంతో బౌలింగ్లో ఇబ్బంది పడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ మున్ముందు మ్యాచుల్లో మరింత ఇబ్బంది పడనుంది...