MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • టీ20 వరల్డ్‌కప్‌కి జట్టుని ప్రకటించిన బీసీసీఐ... మెంటర్‌గా ఎమ్మెస్ ధోనీ...

టీ20 వరల్డ్‌కప్‌కి జట్టుని ప్రకటించిన బీసీసీఐ... మెంటర్‌గా ఎమ్మెస్ ధోనీ...

టీ20 వరల్డ్‌కప్‌ 2021కి భారత జట్టుని ప్రకటించింది బీసీసీఐ... ముందుగా చెప్పినట్టుగానే కొన్ని సర్‌ప్రైజ్‌లతో 15 మంది ప్లేయర్లు, నలుగురు స్టాండ్ బై ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది భారత క్రికెట్ బోర్డు...

2 Min read
Chinthakindhi Ramu
Published : Sep 08 2021, 09:38 PM IST| Updated : Sep 08 2021, 09:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

విరాట్ కోహ్లీ: టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు... ముందుగా ప్రకటించినట్టుగానే ఈ లీగ్‌లో ఓపెనర్‌గా కూడా రావాలనుకుంటున్నాడు విరాట్ కోహ్లీ.

210

రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లను ఎంపిక చేసింది బీసీసీఐ. రోహిత్ ఈ మెగా టోర్నీకి వైస్ కెప్టెన్‌గా,  కెఎల్ రాహుల్ అవసరమైతే వికెట్ కీపర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా రాబోతున్నాడు.

310

వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్‌తో పాటు ఇషాన్ కిషన్‌కి కూడా అవకాశం ఇచ్చింది బీసీసీఐ. వన్‌డౌన్ ప్లేయర్‌గా సూర్యకుమార్ యాదవ్‌కి చోటు దక్కింది...

410

హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్లుగా టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపికయ్యారు. హార్ధిక్ పాండ్యా అన్న కృనాల్ పాండ్యాకి మాత్రం నిరాశే ఎదురైంది...

510

కొన్నేళ్లుగా టెస్టులకే పరిమితమైన రవిచంద్రన్ అశ్విన్‌ను సర్‌ప్రైజ్ ప్యాక్‌గా టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక చేసింది బీసీసీఐ. వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో అశ్విన్‌కి చోటు దక్కినట్టు అంచనా...

610

అక్షర్ పటేల్‌, రాహుల్ చాహార్, వరుణ్ చక్రవర్తిలకు అవకాశం ఇచ్చిన బీసీసీఐ, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న యజ్వేంద్ర చాహాల్‌, కుల్దీప్ యాదవ్‌లకు షాక్ ఇచ్చింది...

710

జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత పేస్ భారాన్ని మోయనున్నారు....

810

వీరితో పాటు స్టాండ్‌బై ప్లేయర్లుగా శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్‌లకు టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ కోసం యూఏఈ వెళ్లనున్నారు. 

910

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేకుండా ఆడుతున్న మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ ఇది. ఈ టోర్నీకి మహీ మెంటర్‌గా వ్యవహారించబోతున్నట్టు బీసీసీఐ సెక్రటరీ జే షా తెలిపారు...

1010

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి భారత జట్టు ఇది: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహార్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ
స్టాండ్ బై ప్లేయర్లు: శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
Recommended image2
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !
Recommended image3
T20 World Cup: దటీజ్ ఇషాన్ కిషన్.. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఏం చేశాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved