లంక ప్రీమియర్ లీగ్లో బరిలో దిగుతున్న భారత ఆల్రౌండర్... ఇర్ఫాన్ పఠాన్ కొత్త జర్నీ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సూపర్ సక్సెస్ తర్వాత పదుల సంఖ్యలో టీ20 లీగ్లు పుట్టుకొచ్చాయి. బిగ్బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్ వంటివి సక్సెస్ కూడా అయ్యాయి. కరోనా పరిస్థితులను దాటుకుని ఐపీఎల్ నిర్వహించి, సూపర్ సక్సెస్ సాధించింది బీసీసీఐ. ఇప్పుడు శ్రీలంక ప్రీమియర్ లీగ్ కూడా మొదలుకాబోతోంది. ఈ ఎల్పీఎల్లో భారత ఆల్రౌండర్ పాల్గొనబోతుండడం విశేషం.
లంక ప్రీమియర్ లీగ్లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించిన ఇర్ఫాన్ పఠాన్, ఈ ప్రయాణం కొత్తగా ఉందంటూ ట్వీట్ చేశాడు...
లంక ప్రీమియర్ లీగ్లో కండ్యా టస్కర్స్ జట్టు తరుపున ఆడేందుకు భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు...
ఇర్ఫాన్ పఠాన్ జట్టులో విండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ ‘యూనివర్సల్ బాస్’ క్రిస్గేల్ కూడా ఉన్నాడు...
వీరితో పాటు లంక ప్లేయర్లు కుషాల్ పెరీరా, కుషాల్ మెండీస్, నువాన్ ప్రదీప్ తదితరులు కండ్యా టస్కర్స్ జట్టులో సభ్యులుగా ఉన్నారు...
లంక ప్రీమియర్ లీగ్లో కొలంబో, కండ్యా, గాలె, దంబుల్లా, జఫ్నా.. అంటూ ఐదు ఫ్రాంఛైజీలు పాల్గొనబోతున్నాయి... నవంబర్26 నుంచి ప్రారంభం కానుంది ఎల్పీఎల్ 2020.
హర్భజన్ సింగ్ తర్వాత టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్గా రికార్డు క్రియేట్ చేసిన ఇర్ఫాన్ పఠాన్... తన కెరీర్లో 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచులు ఆడాడు.
2007 టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన ఇర్ఫాన్ పఠాన్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 103 మ్యాచులు ఆడిన ఇర్ఫాన్ పఠాన్, 80 వికెట్లు తీసి 1100లకు పైగా పరుగులు చేశాడు. అయితే ఇర్ఫాన్ పఠాన్ వరుసగా ఫెయిల్ అవుతుండడంతో కొన్ని సీజన్లుగా అతన్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకురాలేదు...
ఎనిమిదేళ్ల క్రితం తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఇర్ఫాన్ పఠాన్, భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని ఏడేళ్లకు పైగా ఎదురుచూశాడు. అయితే అది వీలుకాకపోవడంతో 2019లో రిటైర్మెంట్ ప్రకటించాడు ‘బరోడా ఎక్స్ప్రెస్’ ఇర్ఫాన్ పఠాన్.
క్రికెటర్గా రిటైర్మెంట్ ప్రకటించకముందే కామెంటేటర్గా కెరీర్ మొదలెట్టిన ఇర్ఫాన్ పఠాన్, అనేక ఐపీఎల్ సీజన్లకు, వరల్డ్కప్ 2020 వంటి టోర్నీలకు కూడా వ్యాఖ్యతగా వ్యవహారించాడు.