MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • India vs Pakistan: వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.. భారత్-పాక్ మ్యాచ్ పై కీలక ప్రకటన చేసిన బీసీసీఐ

India vs Pakistan: వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.. భారత్-పాక్ మ్యాచ్ పై కీలక ప్రకటన చేసిన బీసీసీఐ

ICC T20 World cup: మరో రెండ్రోజుల్లో భారత్-పాక్ మ్యాచ్ జరుగనుండగా తాజాగా ఈ మ్యాచ్ ను రద్దు చేయాలని సామాజిక మాధ్యమాలతో పాటు  రాజకీయ నాయకులు  కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక ప్రకటన చేసింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 19 2021, 10:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 24న భారత్-పాక్ మ్యాచ్ జరుగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు దేశాల ఫ్యాన్స్ తో పాటు  ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే  ఈ హైఓల్టేజీ మ్యాచ్ ను ఇష్టపడేవారితో పాటు వ్యతిరేకించే వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా భారత్ లో సామాజిక మాధ్యమాలతో పాటు  కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ను రద్దు చేయాలని కోరారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇదే విషయం ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతోంది.  రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్ ను రద్దు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. 

36

ట్విట్టర్ లో #Banpakcricket హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్ కూడా మ్యాచ్ రద్దు చేయాలని కోరే వారికి మద్దతు పలికారు. 

46

తాజాగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ మ్యాచ్ పై స్పందించారు. బోర్డర్ లో భారత సైనికులు చచ్చిపోతుంటే పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడటం అవసరమా..? అని ప్రధాని మోడీని ప్రశ్నించారు. 

56

కాగా, దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఇదే విషయమై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రసంస్థలపై కఠినంగా చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. 

66

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఐసీసీకి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం.. ఏదైనా జట్టుతో మేము ఆడమని తిరస్కరించే వీలులేదు. ఐసీసీ టోర్నీలో ఒకసారి కమిట్ అయ్యాక తప్పకుండా ఆడాల్సిందే.. అని స్పష్టం చేశారు. కశ్మీర్ లో ఉగ్రవాదుల చర్యలను ఖండించిన ఆయన.. ఐసీసీకి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేమని చెప్పారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL Qualifier 2, GT vs RR : గిల్ దెబ్బకు రాజస్థాన్ విలవిల... గుజరాత్ విజయానికి ప్రధాన కారణాలివే
Recommended image2
Vaibhav Sooryavanshi :100 మిస్సైతేనేంరా బుడ్డోడా, 1000 కొట్టేశావుగా : శతకం కాదు వైభవ శకమే..!
Recommended image3
IPL 2026: పాకిస్థాన్‌లోనూ వైభవ్ సూర్యవంశీ క్రేజ్.. మాములుగా లేదు మనోడి రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved