చివరిగా లంక సిరీస్ గెలిచినప్పుడు, పృథ్వీషా పుట్టనేలేదు... నాలుగేళ్లలో ఆరో కెప్టెన్...
శ్రీలంక, టీమిండియా మధ్య వన్డే సిరీస్కి లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. ఇంగ్లాండ్ టూర్ నుంచి వచ్చిన ప్లేయర్లు అందరికీ నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది... దీంతో షెడ్యూల్ ప్రకారం జూలై 13 నుంచి ఇండియా, శ్రీలంక మధ్య సిరీస్ ప్రారంభం కానుంది...
శ్రీలంక, ఇండియా మధ్య జరిగిన గత 10 ద్వైపాక్షిక సిరీసుల్లోనూ భారత జట్టు విజయం సాధించింది. 1982 నుంచి ఇప్పటిదాకా భారత్, లంక మధ్య 18 సార్లు సిరీస్లు జరిగాయి. వీటిలో రెండుసార్లు లంక జట్టుకి విజయం దక్కింది...
14 సార్లు భారత జట్టు, వన్డే సిరీస్లను కైవసం చేసుకోగా, 1985, 1997ల్లో జరిగిన సిరీస్లు డ్రాగా ముగిశాయి. చివరిసారిగా శ్రీలంక, భారత్పై వన్డే సిరీస్ గెలిచి 24 ఏళ్లు అవుతోంది...
1997 ఆగస్టులో అర్జున రణతుంగ కెప్టెన్సీలో లంక జట్టు, టీమిండియాను ఓడించి వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆ సమయంలో లంక జట్టులో సనత్ జయసూర్య, ఆటపటట్టు, అరవింద డి సిల్వ, ఉపుల్ చందన, కుమార ధర్మసేన, ముత్తయ్య మురళీధరన్ వంటి లెజెండరీ ప్లేయర్లు ఉన్నారు...
శ్రీలంక చివరిగా భారత్పై వన్డే సిరీస్ గెలిచే సమయానికి భారత జట్టు ఓపెనర్ పృథ్వీషా ఇంకా పుట్టనేలేదు. అంతేకాదు అప్పటికి ఇంకా సౌరవ్ గంగూలీ, భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు కూడా చేపట్టలేదు...
శ్రీలంక బ్యాటింగ్ కోచ్తో పాటు తాజాగా టీమ్ అనాలసిస్ట్ కూడా కరోనా బారిన పడ్డాడు. అయితే జట్టులో ఏ ప్లేయర్కి పాజిటివ్ రాకపోవడంతో ఊపిరి పీల్చుకుంది లంక క్రికెట్ బోర్డు...
సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో విభేదాల కారణంగా ఇంగ్లాండ్ టూర్లో కెప్టెన్గా వ్యవహారించిన కుశాల్ పెరేరాను ఆ బాధ్యతల నుంచి తప్పించింది లంక బోర్డు. అతని స్థానంలో దసున్ శనకను కొత్త కెప్టెన్గా నియమించే అవకాశం ఉంది...
2017 నుంచి ఇప్పటిదాకా ఏకంగా ఆరుగురు కెప్టెన్లను మార్చింది లంక క్రికెట్ బోర్డు. 2016 నుంచి చూస్తే ఈ సంఖ్య 10... ప్రపంచ క్రికెట్లోనే ఇంత తక్కువ కాలంలో ఏ జట్టూ ఇంత మంది కెప్టెన్లను మార్చలేదంటే లంక పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు.