వాళ్ల వీక్నెస్లన్నీ నాకు తెలుసు... న్యూజిలాండ్ టీమ్పై రోహిత్ శర్మ కామెంట్...
భారత హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు అసలు సిసలైన ఛాలెంజ్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఎదురుకానుంది. విదేశీ పిచ్లపై పెద్దగా చెప్పుకోదగ్గ రికార్డు లేని రోహిత్ శర్మపై ఈసారి భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఫైనల్ను చాలా ఈజీగా తీసుకుంటానంటున్నాడు రోహిత్...
‘ఇంతకుముందు న్యూజిలాండ్తో నేను చాలాసార్లు ఆడాను. వాళ్ల బలాలు ఏంటో నాకు బాగా తెలుసు, అలాగే వారి వీక్నెస్లు కూడా తెలుసు... ఇక్కడి కండీషన్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు...
ప్రస్తుతం టీమ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందనేది మాత్రమే అవసరం. టీమ్ వాతావరణం బాగుంటే, ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అద్భుతంగా రాణించొచ్చు...
మొదట బ్యాటింగ్ చేస్తున్నామా? బౌలింగ్ చేస్తున్నామా? అనేది కీలకం కాదు. దాని గురించి అతిగా ఆలోచించి బుర్రపాడు చేసుకోవాలని అనుకోవడం లేదు...
న్యూజిలాండ్ ఓ నాణ్యమైన జట్టు. వారితో ఫైనల్ ఆడేటప్పుడు ఎలాంటి ప్లేయర్ అయినా ది బెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకానీ ప్రెషర్ తీసుకోకూడదు. అందుకే నేను ఎక్కువ ఆలోచించాలని అనుకోవడం లేదు...
ఐదు రోజుల పాటు సాగే ఫైనల్లో ప్రతీ సెషన్ ఓ ఛాలెంజ్ లాంటిదే. ఇంతకుముందెప్పుడూ ఇలాంటి టెస్టు ఫైనల్ జరగలేదు. కాబట్టి ప్రతీదీ ఛాలెంజింగ్గా ఉంటుంది...
టెస్టుల్లో రాణించాలంటే సహనం చాలా అవసరం. భిన్నమైన పరిస్థితుల్లో ఆడడం అంత తేలికైన విషయం కాదు. మానసికంగా దృఢంగా ఉండడం చాలా అవసరం...
ఫీల్డ్లో పరిస్థితులకు తగ్గట్టుగా అప్పటికప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా శారీరకంగా కూడా ఫిట్గా ఉంటూ, ఎలాంటి ఛాలెంజ్కైనా సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టోర్నీలో అజింకా రహానే తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్గా ఉన్నాడు రోహిత్ శర్మ...
డబ్ల్యూటీసీ టోర్నీలో 1035 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఇంగ్లాండ్తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్లో 161 పరుగులతో రాణించి అదరగొట్టాడు... అయితే విదేశాల్లో మాత్రం అతని రికార్డు ఏ మాత్రం మెరుగ్గా లేదు.
స్వదేశంలో 80+ సగటుతో చెలరేగిపోయే రోహిత్ శర్మ, విదేశాల్లో మాత్రం కేవలం 27 సగటుతో పరుగులు చేశాడు. అయితే ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సౌంతిప్టన్లో రోహిత్ శర్మకు ఓ సెంచరీ ఉంది.
2019 వన్డే వరల్డ్కప్ టోర్నీలో ఇదే వేదికలో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో చెలరేగాడు. అయితే టెస్టుల్లో మాత్రం భారత జట్టు నుంచి ఛతేశ్వర్ పూజారా మాత్రమే ఇక్కడ సెంచరీ చేశాడు.