గెలిస్తే 12, డ్రా అయితే 4, టై అయితే 6.. డబ్ల్యూటీసీ పాయింట్ల పద్ధతిలో మార్పులు చేసిన ఐసీసీ...
‘భారత్, బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ గెలిచినా, ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ గెలిచినా ఒకటే పాయింట్లా? రెండు ఒక్కటేనా?’ డబ్ల్యూటీసీ పాయింట్ల పద్ధతిపై ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వ్యక్తం చేసిన అసంతృప్తి ఇది... ఇలాంటి విమర్శలతో ఐసీసీ, డబ్ల్యూటీసీ పాయింట్ల పద్ధతిలో మార్పులు చేసింది.
ఐసీసీ నిర్వహించిన మొట్టమొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో మ్యాచులతో సంబంధం లేకుండా, గెలిచే ఒక్కో టెస్టు సిరీస్కు 120 పాయింట్లు కేటాయించారు. ఫలితంగా బంగ్లాదేశ్పై రెండు టెస్టుల సిరీస్ గెలిచిన భారత్కి 120 పాయింట్లు రాగా, యాషెస్ గెలిచిన ఆసీస్కి ఇవే పాయింట్లు దక్కాయి...
ఈ పాయింట్ల పద్ధతి కారణంగా ఎక్కువ మ్యాచులు ఆడిన ఇంగ్లాండ్ జట్టు భారీగా నష్టపోయింది. దీంతో ఏ జట్టూ నష్టం కలగకుండా అత్యంత పారదర్శకంగా పాయింట్ల కేటాయింపు ఉండేలా డబ్ల్యూటీసీ 2021-23 సీజన్లో సమూల మార్పులు చేసింది ఐసీసీ...
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సీజన్ 2లో ప్రతీ టెస్టు మ్యాచ్ గెలిచే జట్టుకి 12 పాయింట్లు కేటాయించబడతాయి. టై అయితే 6 పాయింట్లు, డ్రా అయితే చెరో 4 పాయింట్లు ఇస్తారు. ఓడిన జట్టుకి పాయింట్లు ఉండవు... అలాగే విజయాల శాతం లెక్కించడంలోనూ మార్పులు తీసుకొచ్చింది ఐసీసీ.
ఆడిన మొత్తం మ్యాచుల్లో, గెలిచిన మ్యాచుల శాతాన్ని లెక్కించి, పాయింట్లను నిర్ణయించేవాళ్లు. అయితే ఈసారి డ్రా చేసుకున్న మ్యాచులకు కూడా పర్సెంటేజ్లో భాగం కల్పించారు. గెలిచిన మ్యాచ్కి 100 శాతం, టై అయిన మ్యాచ్కి చెరో 50 శాతం, డ్రా అయిన మ్యాచ్కి చెరో 33.33 శాతం పర్సెంటేజ్ పాయింట్లు వస్తాయి...
ఉదాహరణకి ఇంగ్లాండ్ టూర్లో టీమిండియా ఐదుకి ఐదు మ్యాచులు గెలిస్తే 60 పాయింట్లు, 100 శాతం విజయాల శాతం వస్తుంది. నాలుగు మ్యాచులు గెలిచి, ఒకటి డ్రా చేసుకుంటే 52 పాయింట్లు 86.66 శాతం విన్నంగ్ పర్సెంటేజ్ దక్కుతాయి... మూడు గెలిచి, రెండు ఓడితే 36 పాయింట్లు, 60 శాతం విజయాల శాతం దక్కుతుంది.
అలాగే డబ్ల్యూటీసీ 2021-23కి సంబంధించి 9 జట్ల పూర్తి షెడ్యూల్ను కూడా విడుదల చేసింది ఐసీసీ. ఈ సీజన్లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, విండీస్లతో స్వదేశంలో, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక జట్లపై విదేశాల్లో సిరీస్లు ఆడనుంది.
అలాగే బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక జట్లతో స్వదేశంలో, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్లపై విదేశాల్లో టెస్టు సిరీస్లు ఆడుతుంది...
ఇంగ్లాండ్ జట్టు భారత్, సౌతాప్రికా, న్యూజిలాండ్పై స్వదేశంలో, పాకిస్తాన్, వెస్టిండీస్, ఆస్ట్రేలియాపై వారి దేశాల్లో టెస్టు సిరీస్లు ఆడనుంది...
భారత జట్టు స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలపై టెస్టు సిరీస్లు ఆడితే, విదేశాల్లో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికాలతో టెస్టు సిరీస్లు ఆడుతుంది...
న్యూజిలాండ్ జట్టు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంకపై స్వదేశంలో, ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఇండియాలపై విదేశాల్లో సిరీస్లు ఆడుతుంది...
పాకిస్తాన్ జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లతో, విదేశాల్లో శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్లతో టెస్టు సిరీసులు ఆడనుంది...
సౌతాఫ్రికా జట్టు ఇండియా, వెస్టిండీస్, బంగ్లాదేశ్లపై స్వదేశంలో, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్లపై విదేశాల్లో సిరీస్లు ఆడుతుంది...
శ్రీలంక జట్టు విండీస్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్లతో స్వదేశంలో, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇండియాలపై విదేశాల్లో సిరీస్లు ఆడబోతోంది...
అలాగే వెస్టిండీస్ జట్టు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్లపై స్వదేశంలో, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంకలపై విదేశాల్లో సిరీస్లు ఆడనుంది...