వరలక్ష్మీ శరత్ కుమార్... ఆ క్రికెటర్ను పెళ్లాడబోతోందా...
హీరో శరత్కుమార్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కొద్దికాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ. బొద్దుగా, ముద్దుగా ఉండే వరలక్ష్మీ, హీరో విశాల్తో చాలాకాలం ప్రేమాయణం నడిపించింది.
వరలక్ష్మీ, విశాల్ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది.
అయితే శరత్ కుమార్, విశాల్ మధ్య నెలకొన్న వైరం కారణంగా ఈ ప్రేమ జంట విడిపోయింది.
వరలక్ష్మీతో బ్రేకప్ తర్వాత విశాల్ మరో అమ్మాయితో పెళ్లికి రెఢీ అయిపోయాడు కూడా. మరోవైపు వరలక్ష్మీ కూడా ఫలానా హీరోతో ప్రేమలో ఉంది, ఇంకో హీరోను పెళ్లాడబోతుంది అంటూ చాలా వార్తలు పుట్టుకొచ్చాయి.
అయితే 35 ఏళ్ల వరలక్ష్మీ శరత్కుమార్ ఈ వార్తలన్నీ ఉట్టి పుకార్లేనని కొట్టిపారేసింది... అయితే తాజాగా వరలక్ష్మీ ఓ యువ క్రికెటర్ను పెళ్లాడబోతోందని వార్తలు వస్తున్నాయి.
రాధికా, శరత్కుమార్ల కూతురు ర్యాన్, భారత యంగ్ క్రికెటర్ అభిమన్యు మిథున్ను పెళ్లాడింది... వరలక్ష్మీ 1985లో జన్మించగా, 2001లో రాధికాను పెళ్లాడాడు శరత్కుమార్.
శరత్ కుమార్ మొదటి భార్య ఛాయ కూతురైన వరలక్ష్మీ కూడా ఓ క్రికెటర్ను పెళ్లాడేందుకు సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది...
అయితే ఈ వార్తలపై వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంకా స్పందించలేదు.
2019లో తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ సినిమాతో మొదటి సినిమా చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్, ఈ ఏడాది విడుదలైన ‘క్రాక్’లో జయమ్మగా నటించి, అందరి ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం తమిళ్లో ఏడు, కన్నడలో ఓ సినిమా చేస్తున్న వరలక్ష్మీ శరత్కుమార్, తెలుగులో ‘అల్లరి’ నరేశ్ హీరోగా రూపొందుతున్న ‘నాంది’లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
విజయ్ హీరోగా నటించిన ‘సర్కార్’, విశాల్ హీరగా రూపొందిన ‘పందెం కోడి’ స్వీకెల్ ‘పందెం కోడి 2’ సినిమాల్లో విలనీ వేశాలు వేసిన వరలక్ష్మీ, ఇప్పుడు కోలీవుడ్లో మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్...
తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మీ నటన, తెలుగు ప్రేక్షకులకు ఆమెను మరింత చేరువ చేసింది.